Sunita Williams : ప్రజా దీవెన, హైదరాబాద్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమ గామి సునీతా విలియమ్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక సమ యం స్పేస్వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా ఆమె రికార్డు నెల కొల్పారు. ఇప్పటివరకు ఆమె 62 గంటల 6 నిమిషాల పాటు అంతరి క్షంలో నడిచారు. గతేడాది జూన్లో నాసా వ్యోమగాములు సునీతా విలిమయ్స్, బుచ్ విల్మోర్లు 8 రోజుల యాత్ర కోసం బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్లైనర్ వ్యోమ నౌకలో ఐఎస్ఎస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, స్పేస్క్రాఫ్ట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్పటి నుంచి అక్కడే చిక్కుకు పోయారు.
ఈ క్రమంలో గురువారం ఐఎస్ఎస్ నుంచి వెలుపలికి వచ్చి న సునీత, విల్మోర్లు కొన్ని మర మ్మతులు నిర్వహించారు. 6.5 గం టల పాటు ఈ ప్రక్రియ కొనసాగిం ది. ఇది సునీతా విలియమ్స్ తొమ్మి దో స్పేస్వాక్ కాగా విల్మోర్కు ఐ దోది. మెుత్తం 62. 6 గంటల పాటు ఈ విన్యాసంలో సునీత పాల్గొన్నా రు. దీంతో గతంలో నాసా వ్యోమ గామి పెగ్గీ విట్సన్ 60. 21 గంటల పాటు స్పేస్వాక్ నిర్వహించారు.
గురువారం నాటి స్పేస్వాక్తో సునీత ఆమెను అధిగమించారు. దీనికి సంబంధించిన వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా షేర్ చేసింది.సునీతా విలియ మ్స్, బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి 6.5 గంట ల పాటు మరమ్మతులు నిర్వహిం చినట్టు వీడియోను ఎక్స్ (ట్విట్టర్) లో పెట్టింది. సునీతా విలియమ్స్, విల్మోర్లు ఐఎస్ఎస్ నుంచి బయటకొచ్చి.. రేడియా ఫ్రీక్వెన్సీ గ్రూప్ యాంటీన్నా వ్యవస్థ సహా ప్రైమరీ అబ్జెక్టివ్లను పూర్తిచేశారని తెలిపింది. అంతేకాదు, అక్కడి ఉపరితలంపై నమూనాలను ల్యాబ్లో విశ్లేషణ కోసం సేకరిం చినట్టు పేర్కొంది.
మరోవైపు, ఐఎస్ఎస్లో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ సహకారం తీసుకుం టున్నట్టు నానా వెల్లడించింది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్పష్టం చేశా రు. వ్యోమగాములను తీసుకొ చ్చేందుకు మస్క్ సాయం కోరినట్టు తెలిపారు. వారి గురించి మాజీ అధ్యక్షుడు బైడెన్, ఆయన యం త్రాంగం పట్టించుకోలేదని ఆరోపిం చారు.