Sunpreet Singh: ప్రజా దీవెన ,కోదాడ: సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ (Sunpreet Singh)ఐపీఎస్ ఆదేశాల మేరకు కోదాడ రూరల్ సిఐ రజిత రెడ్డి అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలపై పోలీస్ కళాబృందంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతీ యువకులు మత్తు పదార్థాలు గంజాయి గుట్కా డ్రగ్స్ మత్తు పదార్థాలపై సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ (Police Department)పటిష్టంగా పనిచేస్తున్నాయని తెలిపారు ప్రతి గ్రామంలోనూ స్కూళ్లలో కళాశాలలో చదువుకునే విద్యార్థులు యువతీ యువకులు ఇంటెర్నెట్ ను సద్వినియోగం చేసుకొని సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలు గురి కాకుండా చూసుకోవాలని తెలిపారు ముఖ్యంగా బ్యాంకు ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటిపివివరాలు ఇతరులకు తెలుపవద్దని అన్నారు ఇతరులు ఆశ చూపెడితే వాటికి ఆకర్షితులు కావద్దని మెసేజ్లు వచ్చే బ్లూ లింక్ లు అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని తెలిపారు.
మోసాలపై 1930 టోల్ ఫ్రీ నెంబర్ (Toll free number)కు ఫిర్యాదు చేయాలని అన్నారు అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగంగా ప్రయాణించ వద్దని వేధింపులపై జరిగినట్లయితేసమాచారం ఇవ్వాలని తెలిపారు వ్యక్తిగత సమాచారం బ్యాంకు వివరాలు ఏటీఎం పిన్ నెంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయకూడదని వ్యక్తిగత ఫోటోలు డిపి లాగా పెట్టుకోవద్దని అనంతగిరి ఎస్ ఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) లేకుండా వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ రూల్స్ అత్యధికమించవద్దని తెలిపారు యువత చెడు అలవాటులకుదూరంగా ఉండాలని సామాజిక మాధ్యమాలు రక్షణగా బలమైన పాస్వర్డ్ పెట్టుకోవాలని అన్నారు అనంతరం పోలీస్ కళాబృందం వారు చక్కని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రఘు పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ అజయ్ కానిస్టేబుల్ నాగరాజు హోంగార్డు సంజయ్ కళాబృందం ఇన్చార్జి ఎల్లయ్య గోపయ్య గురులింగం కృష్ణ చారి నాగార్జున మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు