ప్రజా దీవెన,కోదాడ: కోదాడ మున్సిపల్ పరిధిలోని జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు సర్వే జరుగుతున్న తీరును సర్వే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లు పథకానికి లబ్దిదారుల ఎంపిక చేసేందుకు సర్వే జరుగుతుందని ఈ సర్వే ని పగడ్బందీగా అధికారులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కోదాడ ఆర్టీవో సూర్యనారాయణ తాసిల్దార్ వాజిద్ అలీ రెవెన్యూ అధికారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.