Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Swarna Bharti Trust: స్వర్ణ భారతీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్యడు వంశీకి అంత్యక్రియలు.

వంశీకృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపిన పలువురు పట్టణ ప్రముఖులు.

Swarna Bharti Trust: ప్రజా దీవెన,కోదాడ: పట్టణ పరిధిలోని తమ్మర పేద ఆర్యవైశ్య కుటుంబానికి (Arya Vaishya family)చెందిన తూములూరి. వంశీకృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బస్టాండ్ ఏరియాలో కాలం గడుపుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో  విషయం తెలుసుకున్న కోదాడ స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ (Swarna Bharti Trust) అధ్యక్షులు గాదం శెట్టి. శ్రీనివాసరావు, ట్రస్ట్ సభ్యులు, వంశీకృష్ణ దూరపు బంధువులు, మిత్రులు, స్థానిక బిజెపి నాయకుల సహకారంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైకుంఠ రథంపై తీసుకెళ్లి బాలాజీ నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఉన్నతమైన చదువులు (Higher studies) చదివిన వంశీకృష్ణ ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో ఎందరో పేదలకు రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు అందించి నిస్వార్ధంగా సేవ చేశారని వారు చేసిన సేవలను పలువురు స్మరించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు గాదంశెట్టి. శ్రీనివాసరావు, కోశాధికారి. ఇరుకుళ్ల.చెన్నకేశవరావు,జాయింట్ సెక్రటరీ యాద. సుధాకర్,బిజెపి సీనియర్ నాయకులు కనగాల. వెంకటరామయ్య,నూనె. సులోచన, కనగాల. నారాయణ, అక్కిరాజు. యశ్వంత్, వంగవీటి. శ్రీనివాసరావు,రాయపూడి.వెంకటనారాయణ, బంధువులు రేపాల.నాగేందర్, తూములూరి.గోపి,కిషోర్ తదితరులు పాల్గొన్నారు……