–యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్ళు
— జూలై 05 నుండి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్ళు
— రైల్వే టూరిజం జాయింట్ జనర ల్ మేనేజర్ కిషోర్ వెల్లడి
Pilgrimage News : ప్రజా దీవెన, హైదరాబాద్: తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులో కి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 05 వ తేదీ నుం డి జూలై 13 వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారం భిస్తున్నట్లు IRCTC టూరిజం జా యింట్ జనరల్ మేనేజర్ DSGP కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. యాత్రకి సంబందించిన వివరాలు వెల్లడించారు.
ప్యాకేజీ వివరాలు : (ఐదు జ్యో తిర్లింగ యాత్ర – SCZBG43): ఉజ్జయిని (మహాకాళేశ్వర్ – ఓంకారేశ్వర్) – త్రయంబకేశ్వర్ – భీమశంకర్ – ఘృష్ణేశ్వర్). ఈ యాత్రలో మహాకాళేశ్వర్ / ఓంకారేశ్వర్ / త్రయంబకేశ్వర్ / భీంశంకర్ / ఘృష్ణేశ్వర్ / ఎల్లోరా / మోవ్/ నాగ్పూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు. ఈ యాత్ర జూలై 05 వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంట్టుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14700, 3 ఏసీ ధర 22900, 2 ఏసీ ధర 29900 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ కామారెడ్డి నిజామా బాద్ ధర్మాబాద్ నాందేడ్ ముధ్ఖడ్ మరియు పూర్ణ మీదుగా వెళ్తుంది.
సౌకర్యాలు: రైలు, బస్సు, హో టల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం), వాటర్ బాటిల్ మరి యు టూర్ ఎస్కాట్ సేవలతో సం దర్శనా స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్ అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాల యాలకు ప్రయాణం పూర్తిగ ఉచి తం. ప్రతి రైలు లో 718 మంది ప్ర యాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందు బాటులో ఉండి అన్ని సావకార్యా లు సమకురుస్తారు. కోచ్ కి ఒక సె క్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుం దని తెలియజేశారు. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు..9701360701,9281495843, 9281030750, 9281 030749 లకు సంప్రదించాలని మరిన్ని వివరణలకు www.irctct ourism.com వెబ్సైట్ ని సంప్రధిం చాలని సూచించారు.