Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tagoni Venkanna Goud: రైతులకు తక్షణమే రైతు భరోసా చెల్లించాలి

Tagoni Venkanna Goud: ప్రజా దీవెన, శాలిగౌరారం: రైతులకు వెంటనే రైతు భరోసా చెల్లించి ఆదుకోవాలని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అయి తగోని వెంకన్న గౌడ్ (Tagoni Venkanna Goud)అన్నారు. కేటీఆర్ పిలుపు తో శాలిగౌరారం లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష (Initiation of protest) చేపట్టారు. అనంతరం రోడ్డు పై రాస్తారోకో చేసి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.ఇచ్చిన హామీలను అమలు చేయడం లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విఫలం అయ్యిందన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు మామిడి సర్వయ్య, జిల్లా నాయకులు గుజలాల్ శేఖర్ బాబు,జేరిపోతుల చంద్రమౌళి, దాసరి నథానియల్, అక్కినేపల్లి శ్రీరాములు, మామిడి రమేష్,మాచర్ల అంజయ్య,బైరు నాగరాజు, పనికర కమలాకర్, దొనకొండ అంజయ్య, రాగి దావీద్, బడేసాబ్ తదితరులు పాల్గొన్నారు.