Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Task Force Team: వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన స్టేట్ టాస్క్ఫోర్స్ టీం

Task Force Team: ప్రజాదీవెన,కోదాడ: కోదాడ ,హుజూర్నగర్ నియోజకవర్గం లో గల పలుఏ గురుకుల పాఠశాలను, అంగన్వాడి సెంటర్లను స్టేట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీo ఓఎస్డి ఎం ప్రభాకర్ (Task Force Teo OSD M Prabhakar )ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు చిలుకూరులోని అంగన్వాడి సెంటర్ తో పాటు ఆకుపాముల లో గల బీసీ బాలుర గురుకుల పాఠశాల, చిలుకూరు మీట్స్ కళాశాలలో గల బిసి మహిళా గురుకుల పాఠశాల తో పాటు హుజూర్నగర్ లోని మైనారిటీ, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను వారు తనిఖీ చేశారు.

ఈ తనిఖీలలో భాగంగా పాఠశాల ఆవరణలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా , విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని (Quality food for students)అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకొని వారితో పాటు కలిసి భోజనం చేశారు. అదేవిధంగా బియ్యం నాణ్యతను, వంట సామాగ్రిని ఉపయోగించే సరుకులను ఎక్కడ స్టోర్ చేస్తున్నారు అని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం ఇవ్వాలని, క్వాలిటీ వంట సరుకులు తీసుకురావాలని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు సూచించారు. ఈ తనిఖీలలో టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి ,ఎస్ ఐ జంగయ్య ,కోదాడ డిటిసిఎస్ ఎం రామిరెడ్డి ఉన్నారు .