Task training:ప్రజా దీవెన, కోదాడ:స్థానిక కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో బీటెక్ (btech) తృతీయ సంవత్సరం విద్యార్థినిలకు మూడు రోజుల నుండి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి గాంధీ (Gandhi)గారు తెలిపారు. ఈ టాస్క్ శిక్షణ (Task training) తరగతులను శిక్షణ నిపుణుడైనటువంటి మిస్టర్ సతీష్ గారు ఫ్రెంట్ అండ్ డెవలప్మెంట్ అంశాలపై మూడు రోజులపాటు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణా తరగతులు నిర్వహించడం వలన విద్యార్థినిలకు ఎన్నో విద్య ఉపాధి అవకాశాలు కలుగుతాయని కళాశాల అకాడమిక్ డైరెక్టర్ పోతుగంటి నాగేశ్వరరావు గారు తెలిపారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమం ఎంతగానో విద్యార్థులకు ఉపయోగపడుతుందని కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డా. సిహెచ్ నాగార్జున్ రావు గారు (CH Nagarjun Rao) అలాగే ఏఓ కృష్ణారావు గారు మరియు విభాగాధిపతిరాలైనటువంటి స్రవంతి గారు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.