–ప్రమాదాలు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా
చర్యలు
–రిఫ్లెక్టర్ రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా వేసుకునేల జీవో
–త్వరలో డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు
— రాష్ట్ర రవాణా, బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్
–8 కొట్ల తో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
Minister Ponnam Prabhakar :ప్రజాదీవెన నల్గొండ : పొరపాటుగా ప్రమాదాలు చేస్తే అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా భవిష్యత్తులోచర్యలు చేపట్టనున్నమని రాష్ట్ర రవాణా, బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాహనాల వెనక వైపు రిఫ్లెక్టర్ రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా వేసుకునే విధంగా జీవో తీసుకురానున్నమని, అలాగే డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. శనివారం మంత్రి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని దం డంపల్లి వద్ద 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆటో మేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం నడ పడం, వాహనం ఫిట్నెస్ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదా లు జరుగుతున్నాయని, వీటిని తగ్గించేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఉపయోగపడుతుందని అన్నారు. మనిషికి జబ్బు చేసినప్పు డు సీటీ స్కాన్ తీసిన విధంగానే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో సాం కేతిక పరికరాల సహాయంతో సుమారు 15 అంశాలలో వాహనం రోడ్డుపై తిరిగేందుకు పనికి వస్తుందా లేదా అన్నది నిర్ధారిస్తుందని తెలిపారు. రవాణా రంగంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలన్న దే ప్రభుత్వ ఉద్దేశమని, ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటి 8 కోట్ల రూపాయల వ్యయంతో 17 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు రవాణా శాఖ ద్వారా స్క్రాపింగ్ పాలసీని తీసు కువ చ్చామని, ఏటీసీ వల్ల ప్రతి వాహనం వాహన సారధి పరిధిలోకి వ చ్చే విధంగా తెలంగాణను వాహన సారధిలో భాగస్వామ్యం చేశామ ని, ట్రాఫిక్ అవేర్నెస్ లో భాగంగా ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంపుల నిర్వ హణ, పాఠశాలల్లో విద్యార్థులకు క్లబ్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లను ఆటోమేటిక్ గా నిర్వహించి ఆ టెస్ట్ లో పాస్ అయితేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, పాశ్చాత్య దేశాల మాదిరిగానే తెలం గాణలో సైతం ఎవరైనా నిబంధనలు అతిక్రమించితే జరిమానా విధించడమే కాకుండా, పొరపాటున వాహన ప్రమాదం చేసిన ట్లయితే అవసరమైతే వారి లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బ స్సు వలన 20 నెలల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయా ణం చేశారని, నల్గొండ జిల్లాకు 70 ఈ బస్సులు ఇవ్వగా, 10 బస్సు లు నార్కెట్ పల్లికి, తక్కినవి ఇతర ప్రాంతాలకు తిప్పనున్నట్లు వెల్ల డించారు. నార్కెట్ పల్లికి 80 కొత్త బస్సులు కావాలని, అలాగే నార్కె ట్పల్లి కి నూతన డిపో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రవాణా శా ఖ మంత్రితో విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వాహనాల ఫిట్నెస్ సరిగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉం దని, ప్రమాదాల నివారణలో భాగంగా నల్గొండజిల్లాలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం సంతోషమని, జిల్లా యంత్రాంగం తరఫున ఏటీసికి అవసరమైన సహకారం ఇస్తామని తెలిపారు.
జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీవాణి మాట్లాడుతూ మాన్యువల్ గా కాకుండా మిషన్ ద్వారా వాహనాలను పరీక్షించే అవకాశం ఏ టి సి ద్వారా ఉందని తెలిపారు.నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మిర్యా లగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అ మిత్, రవాణా శాఖ కమిషన్ చంద్రశేఖర్, విశ్రాంత ఆర్టీవో మోహన్ రెడ్డి, ఆర్టిఓ మెంబర్లు రాజిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.