*రోగుల వార్డు వైద్యశాల రికార్డులను పరిశీలన .
Tejan Nandalal Power:ప్రజా దీవెన, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ వైద్యశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ తేజం, నందలాల్ పవర్ (Tejan Nandalal Power) ఆకస్మికంగా పరిశీలించారు వైద్యశాల సూపర్డెంట్ (Hospital Superintendent) దశరథ తో కలిసి రోగుల వార్డు పరిశీలించి మహిళా రోగులతో ప్రభుత్వం అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే హాస్పిటల్ ల్యాబ్ లోకి వెళ్లి ప్రతిరోజు నమూనాలను ఎన్ని సేకరిస్తున్నారు రికార్డులలో నమోదు చేస్తున్నారు లేదో స్వయంగా పరిశీలించారు. మందుల రికార్డులను పరిశీలించారు.
డయాలసిస్ యూనిట్ పరిశీలించి రోజు ఎంతమంది రోగులు డయాలసిస్ చేయించుకుంటున్నారని సూపర్ డెంట్ ని అడిగి తెలుసుకున్నారు, ప్రభుత్వం అందిస్తున్న సేవలు రోగులకు అందించాలని ,అలాగే ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలను ఎక్కువ నార్మల్ డెలివరీ (Normal delivery) చేయాలని సూపర్ డెంట్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ ,కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ ,తాసిల్దార్ స్వామి గౌడ్ స్టాప్ నర్సులు జ్యోతి, ప్రసన్న ,లక్ష్మీ ,లాబ్ టెక్నీషియన్ బంక స్రవంతి , రాము, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు