Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tejeshwarmurder : వీడుతోన్న తేజేశ్వర్ మర్డర్ మిస్టరీ..!

–నిందితురాలు ఐశ్వర్యపై అనేక అనుమానాలు
–ప్రధాన నిందితుడు బ్యాంక్ మేనే జర్ తిరుమలరావు అరెస్ట్

Tejeshwarmurder : ప్రజా దీవెన, గద్వాల: దేశ వ్యాప్తం గా సంచలనం సృష్టించిన సర్వేయ ర్ తేజేశ్వర్ మర్డర్ కేసు విచారణ లో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అదే సం దర్భంలో భార్య ఐశ్వర్య అలి యా స్ సహస్ర గతంలో తన తమ్ముడిని సైతం హత్య చేసిందా అన్న అనేక అనుమానాలు వ్యక్త మవుతున్నా యి. పెళ్లికి ముందు ఐశ్వర్య, తల్లి సుజాతల చేష్టలపై విసుగుచెంది ప లుమార్లు హెచ్చరించిన సొంత త మ్ముడు నవీన్ ని సైతం బ్యాంకు మే నేజర్ తో కలిసి హతమార్చి ఉంటారని బంధు వులు ఆరోపిస్తున్నారు.

అతను అనారోగ్యంతో ఇంట్లో జారిపడి చనిపోయాడని అప్పట్లో అం దరినీ నమ్మించారని గుర్తు చేస్తున్నా రు. ఈ ముగ్గురు కలిసి ఇంకా మరె వరినైనా ఇలా చేశారా అనే అను మానాలు వ్యక్తం అవు తున్నాయి. కాగా తల్లి సుజాత బ్యాంకు అటెం డర్ గా పని చేస్తున్న బ్యాంకు మేనే జర్ తిరుమలరావుతో పాటు మరో ఐదుగురితో రిలేష న్ షిప్ మెయింటె న్ చేసినట్టు తెలుస్తోంది.మర్డర్ త ర్వాత తిరుమలరావుతో కలిసి లడ ఖ్ పారిపోయి అక్కడే సహజీవనం చేయాలని ప్లాన్ వేసినట్టు తెలు స్తోంది. ఇందుకోసమే తిరు మలరా వు తాను పని చేసే బ్యాంకులోనే రూ.20 లక్షలు లోన్ తీసుకున్నాడ ని సమాచారం. కానీ మృతుడు తే జేశ్వర్ వదిన ఐశ్వర్యపై అను మా నం వ్యక్తంచేయడంతో కథ అడ్డం తిరిగింది.

ఇప్పటికే హత్యలో భాగమైన ఐశ్వ ర్య, తల్లి సుజాతతోపాటు సుపా రీ గ్యాంగ్ పరుశురాం, రాజు, నగేశ్లను పోలీసులు అదుపులోకి తీసు కు న్నారు. తాజాగా ప్రధాన నిందితు డు బ్యాంక్ మేనేజర్ తిరుమల్రావు విదేశాలకు పారిపోతుండగా శంషా బాద్ ఎయిర్ పోర్టులో ఇవాళ తెల్ల వారు జామున అరెస్ట్ చేసినట్టు తె లుస్తోంది.