Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Congress: బిఆర్ఎస్ ఓట్ల బదిలీ వల్లే నష్టం

–కాంగ్రెస్‌కు 14 సీట్లు వస్తాయని ఆశించాం
–బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కుతో మిగిలినవి కోల్పోయాం
–ఉత్తర తెలంగాణలో హిందూత్వ, మోదీ ప్రభావం
–కురియన్‌ కమిటీకి వెల్లడించిన తెలంగాణ కాంగ్రెస్‌ బృందం

Telangana Congress: ప్రజా దీవెన, హైదరాబాద్‌: బీఆర్‌ ఎస్‌ ఓట్లు బీజేపీకి బదిలీ (Transfer to BJP)కావడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలే దని తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)బృందం వెల్లడించింది. ఈ మేరకు ఏఐసీసీ నియమించిన కురియన్‌ కమిటీ ఎదుట పార్టీ అభ్యర్థులు స్పష్టం చేయడం విశేషం. 14 నుంచి 15 సీట్లు వస్తాయనుకున్నామని, ఎన్ని కలకు కొన్ని రోజుల ముందు బీజేపీ తో బీఆర్‌ఎస్‌ (brs)కుమ్మక్కు కావడంతో 8 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిం దన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలి స్తే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటిం గ్‌ ఏ మాత్రం తగ్గలేదని వివరిం చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.74 శాతం ఓట్లు వస్తే లోక్‌సభ ఎన్నికల్లో 40.1 శాతం ఓట్లు వచ్చా యని గుర్తు చేశారు.

తెలంగాణలో ఆశించిన మేర ఎంపీ (mp)సీట్లు రాకపో వడంపై నిజనిర్ధారణ కోసం ఏఐసీసీ నియమించిన కురియన్‌ కమిటీ (Kurian Committee) గురువారం గాంధీ భవన్‌లో సమా వేశం నిర్వహించింది. లోక్‌సభ ఎన్ని కల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల నుంచి అభిప్రాయాలు నమోదు చేసింది. అయితే, కమిటీ ని కలిసిన వారంతా బీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు వల్లే ఓడిపోయా మని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు (brs)37.35 శాతం ఓట్లు వస్తే, లోక్‌సభ ఎన్నికల కల్లా అది 16.68 శాతానికి పడిపోయిందని వివరించారు. అదే సమయంలో బీజేపీ(bjp) ఓట్ల శాతం 14.15 నుంచి 35.08కు పెరిగిందని వెల్లడించారు. బీజేపీ కంటే కాంగ్రెస్‌ కు 5శాతం ఎక్కువ ఓట్లు వచ్చినా బీజేపీతో సమానంగా 8 సీట్లే వచ్చా యని గుర్తు చేశారు.

బీజేపీ అభ్యర్థు లు గెలిచిన ఏడు చోట్ల బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు దక్కకపోవడం ఆ పార్టీ లు కుమ్మక్కు అయ్యాయనడానికి నిదర్శనమన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ అన్నట్టుగా జరగ్గా లోక్‌సభ ఎన్నిక ల్లో కాంగ్రెస్‌ (congress)వర్సెస్‌ బీజేపీ అన్నట్టు గా నడిచాయని ఎంపీ చామల కిర ణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ను రెండో స్థానానికి పరిమితం చే యాలన్న కుట్రతో బీఆర్‌ఎస్‌, బీజేపీ (BRS, BJP)కలిసి పని చేశాయని ఆరోపించారు. ఈ మేరకు అభిప్రాయాన్ని కమిటీకి వినిపించినట్లు తెలిపారు. సీఎంను కలిసిన కురియన్‌ కమిటీ.. కురియన్‌ కమిటీ సభ్యులు పీజే కురియన్‌, రఖిబుల్‌ హుసేన్‌ గురువారం సీఎం రేవంత్‌ను (cm revanth) ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భం గా సీఎం రేవంత్‌రెడ్డి వారికి శాలువా కప్పి సన్మానించారు.