Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana High court: వీధి కుక్కల స్వైరవిహారం రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం

–సుమోటోగా స్వీకరించిన ఓ కేసు లో హైకోర్టు మరోసారి అసహనం
–కుక్కల దాడులను ఆపేందుకు తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు ప్రశ్నలు

Telangana High court:ప్రజాదీవెన, హైదరాబాద్: తెలంగా ణలో వీధి కుక్కల బెడదపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది అంబర్‎పేట్‎కు చెందిన ప్రదీ ప్ అనే బాలుడు వీధి కుక్కల బారి న పడి మృతి చెందిన విషయం విదితమే. సదరు సంఘటనను సుమోటోగా స్వీకరించిన తెలం గాణ హైకోర్టు మరోసారి విచారిం చింది. ఇందులో భాగంగా కుక్కల దాడులను ఆపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశ్నించింది. ఒక ఘటన జరిగిన వెంటనే అధికారులు అలెర్ట్ అయి తీసుకోవాల్సిన చర్యలలో నిర్లక్ష్యం వహిస్తున్నారని హైకోర్టు అభిప్రాయ పడింది. ఒకవేళ తగిన జాగ్రత్తలు తీసుకొని అన్ని వీధి కుక్కలకు వ్యాక్సిన్ చేయించి ఉంటే మరో ప్రాణం బలి అయ్యేది కాదని హైకోర్టు వాఖ్యానించింది. కొద్దిరో జుల క్రితం పటాన్ చెరువు వద్ద కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. ఆరు సంవత్స రాల విశాల్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో బాలు డు మరణించాడు. ఈ ఘటనలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్‎తో పా టు రెవెన్యూ వెటర్నరీ అధికారు లను వారం రోజుల్లోపు నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించిం ది. మొత్తం రాష్ట్రంలో ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయి వీటిలో ఎన్నిటికి వ్యాక్సినేషన్ చేయించారు అని హైకోర్టు ప్రశ్నించింది.అంబర్‎పేట్‎లో చనిపోయిన బాలుడికి రాష్ట్ర ప్రభు త్వం నుండి ఎనిమిది లక్షల పరి హారం చెల్లించామని రాష్ట్రప్రభు త్వం తరపు న్యాయవాది హైకో ర్టుకు తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి కేవలం పరిహారం చెల్లిస్తే సరిపోతుందా అని ప్రశ్నించింది. అనిమల్ వెల్ఫేర్ బోర్డు ఇప్పటివరకు ఏం చేసిందో తెలుపాలని ప్రశ్నించింది. అంతేకా కుండా ఇప్పటివరకు ఎన్ని కుక్కల కు వ్యాక్సినేషన్ చేశారు అని నివే దికను కోరింది.ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలు ఏమాత్రం సరిపోవ టం లేదని హైకోర్టు అభిప్రాయ పడింది. ఒకవేళ తగు చర్యలు తీసుకుంటే మరో బాలుడు చనిపో యేవాడు కాదు కదా అని తెలి పింది. అసలు సుప్రీంకోర్టు మార్గ దర్శకాలను పాటిస్తున్నారా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. అనుపం త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు మార్గ దర్శకాలు జారీ చేసింది. భారతీయ అనిమల్ వెల్ఫేర్ బోర్డు సూచించిన మార్గదర్శకాలను అందరూ పాటిం చాల్సిందిగా గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి రాష్ట్రంలోనూ అనిమల్ వెల్ఫేర్ సెంటర్లో ఏర్పాటు చేయాలి, వీధి కుక్కలను పట్టుకు నేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేయాలి, ఇలాంటి చర్యలు ఎంతవరకు చేపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో జులై 10న నివేదిక సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.