Telangana Minister Uttam Kumar reddy : మా హయాంలోనే ‘ సొరంగం’
--ఏది ఏమైనా డిండి, ఎస్ఎల్ బి సి సొరంగం పూర్తి చేస్తాం --సొరంగ మార్గం పూర్తికి రూ. 460 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ తో క్యా బినెట్ ముందుంచాం --రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
మా హయాంలోనే ‘ సొరంగం’
–ఏది ఏమైనా డిండి, ఎస్ఎల్ బి సి సొరంగం పూర్తి చేస్తాం
–సొరంగ మార్గం పూర్తికి రూ. 460 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ తో క్యా బినెట్ ముందుంచాం
–రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
ప్రజా దీవెన, దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన డిండి లిఫ్ట్(dindi lift irrigation project) ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు, ఎస్ ఎల్ బి సి సొరంగం పనులనుపూర్తి చేసి తీరుతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయ న ముందుగా అడవిదేవులపల్లి మండలం ,చిట్యాల వద్ద దున్నపో తుల గండి ఎత్తిపోతల పథకంపై సమీ క్షించి అనంతరం హెలి కాప్టర్ లో డిండి చేరుకొని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లాలో ని దేవరకొండ( devarakonda) నియోజకవర్గంతో పాటు మునుగో డు ఇతర నియోజకవర్గాలలో చేపట్టిన ప్రాజెక్టుల పనులపై జిల్లా కలెక్టర్ సి.నారా యణరెడ్డి, స్థానిక శాసనసభ్యులు బాలు నాయక్, మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికా రులతో ( irrigation enginee ring officers) సమీక్ష నిర్వహించారు.
తమ ప్రభుత్వ హాయంలో ఎట్టి పరిస్థితులలో ఎస్ ఎల్ బి సి సొరం గం పనులను, డిండి (dindi) ప్రాజక్ట్ ను పూర్తిచేస్తామని అన్నా రు. ఎస్ ఎల్ బి సి టన్నెల్ నిర్మాణంలో ఒక వైపు నుంచి ఒక రక మైన సమస్య ఉంటే మరోవైపు నుంచి ఇంకో సమస్య ఉందని, అయినప్పటికీ సమస్య లన్నీ తీరుస్తూ ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.ఎస్ ఎల్ బి సి (slbc) సొరంగ మార్గం పూర్తి చేయడానికి రూ. 460 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ వేసి మంజూ రుకు క్యాబినెట్ ముందుకు తీసుకెళ్ళామన్నారు.
డిండి లిఫ్ట్ ఇరి గేషన్ పథకం ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడానికి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేవరకొండ (devarakonda) నియోజకవర్గంలో మంజూరై ఉన్న అంబాభవాని, కంబా లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పూర్తి చేస్తా మని చెప్పారు. దేవర కొండ శాస నసభ్యులు బాలునాయక్ ( mla Balunaik) మాట్లా డుతూ ఐదేళ్ల కాలంలో డిండి ,ఎస్ఎల్బీసీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.
సింగరాయపల్లి ప్రాజెక్టుకు 119 కోట్లు మంజూరు అయ్యా యని, 93 కోట్ల రూపాయ లు విడుదల అయ్యాయని ,80 శాతం పనులు పూర్తయ్యాయని కేవలం 20% పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నం దున వెంటనే వాటిని పూర్తి చేయాల్సిందిగా మంత్రికి విజ్ఞ ప్తి చేశారు. గొట్టిముక్కల ప్రాజక్ట్ దాదాపు పూర్తయిందని, మూడున్నర ఎకరాలకు సంబంధించి భూసే కరణ ( land acquired) సమస్య ఉందని, అలాగే రోడ్డు సమస్య ఉందని వాటిని పరిష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
చింతపల్లి రిజర్వాయర్ ( Chintapalli Reservoir) భూసేకర ణ సమస్య వల్ల పనులు ముందుకు సాగట్లేదని తెలుపగా మంత్రి మాట్లాడుతూ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ మార్గా లు చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించారు. అదేవి ధంగా చింతప ల్లి రిజర్వాయర్లో భూమి కోల్పోతున్న రైతుల సమస్య లను సైతం మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలన్నా రు .డిండి లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్ఎల్బి సి పనులపై ప్రతి నెల సమీక్షిం చాలని శాసనస భ్యులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (mla rajagopal reddy) మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో భూములు కోల్పో యిన , కిష్టరాంపల్లి, చర్ల గూడెం రిజర్వాయర్ల కింద భూములు కో ల్పోయిన నిర్వాసితులకు ఇబ్రహీంపట్నం వద్ద భూ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయిం చాలని కోరారు. ప్రపంచంలోనే అత్యధిక ఫ్లో రైడ్ (Fluorine) ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గమ ని,ఎస్ ఎల్ బి సి, డిండి ఎత్తిపో తల పథకాలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చెప్పడం చాలా అభినందనీయమని అ న్నారు.
డిండి ఎత్తి పోతల పథకంలో కిష్టరాంపల్లి, చర్లగూడెం ప్రాజె క్టులు చాలా పెద్దవని, ఈ రెం డు ప్రాజెక్టుల కింద భూములు కో ల్పోయిన నిర్వాసితులకు (land dwellers) 2018 లో 4 మరియు 5 లక్షలు మాత్రమే పరిహారం అం దిందని, కనీసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో న్యాయం చేయాలన్నా రు.ఉదయ సముద్రం ( udaya samudram) ప్రాజెక్టు కింద మునుగోడు నియోజ కవర్గంలో ఆయకట్టును మరో 200 00 ఎకరాలకు పెంచాలని మంత్రిని కోరారు.
పునాదిగాని కాలువ, ధర్మా రెడ్డి కాలువ, పిలాయి పల్లి కాలువ స్థిరీ కరణను పెంచాలని కోరారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అనిల్, నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు, తది తరులు పాల్గొన్నారు.
Telangana Minister Uttam Kumar reddy