Telangana police : పోలీసుల అలర్ట్, డ్రైవింగ్లో ఫోన్ చేయొద్దు, మాట్లాడొద్దు
--పది నెలల్లో 1.56 లక్షల సెల్ఫోన్ డ్రైవింగ్ కేసుల నమోదు --నిబంధనలు పాటించక, అతివే గం తో రక్తసిక్తమవుతోన్న రహ దారులు --సగటున రోజుకు 21 మంది మృతి
పోలీసుల అలర్ట్, డ్రైవింగ్లో ఫోన్ చేయొద్దు, మాట్లాడొద్దు
–పది నెలల్లో 1.56 లక్షల సెల్ఫోన్ డ్రైవింగ్ కేసుల నమోదు
–నిబంధనలు పాటించక, అతివే గం తో రక్తసిక్తమవుతోన్న రహ దారులు
–సగటున రోజుకు 21 మంది మృతి
Telangana police : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ పోలీసులు ప్రజలను అప్ర మత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గతేడాది పది నెలల్లో సెల్ఫోన్ డ్రైవింగ్ కేసులు 1.56 లక్షలు న మోదయ్యా యి. ఇలా సెల్ఫోన్ డ్రైవింగ్ చేసేవారు, సిగ్నళ్లు జంప్ చేసే చోదకు లు వారితో పాటు ఆ వాహనాల్లో ఉన్నవారి ప్రాణాలకు రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుతెస్తున్నారు. నిబంధనలు పా టిస్తూ నడిపితే మన సమయాన్ని ఆదా చేసే వాహనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విలువైన ప్రాణాల్నే హరిస్తున్నాయి.
రాష్ట్రంలో వాహనదారులు నిబంధ నలు పాటించక పోతుండడంతో ప్ర తిరోజు 21 మంది రోడ్డు ప్రమా దా ల్లో బలవుతున్నారు. నిత్యం 65 మంది గాయాలపాలవుతున్నారు. అర్థమైంది కదా కుటుంబ సభ్యులు డ్రైవింగ్లో ఉంటే మీబాధ్యతగా ఫోన్ చేయకండి. అత్య వసరమై ఫోన్ చేస్తే పక్కన ఆపి మాట్లా డాలని సూచించండి. ఈ నిబం ధనను ప్రతిఒక్కరూ పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తు న్నారు.
2024లో జనవరి నుంచి అక్టోబరు వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,329 మంది రోడ్డు ప్రమాదాల్లో మర ణించగా 19,642 మంది క్షతగాత్రు లయ్యారని నివేదికలు చెబుతు న్నాయి. నిబంధనల ఉల్లంఘన లకు సంబంధించి 2024లో అక్టో బరు నెలాఖరు వరకు పది నెలల్లో అధికారులు పెట్టిన కేసులు 1.18 కోట్లు. జాతీయ, రాష్ట్ర రహదారు ల్లో ప్రమాదాల సంఖ్య అధికంగా ఉంటోంది. 1.18 కోట్ల కేసుల్లో 79 లక్షలు హెల్మెట్ ధరించని వారిపైనే ఉన్నాయి. జనవరిలో రోడ్డు భద్రత వారోత్సవాల నేపథ్యంలో ప్రమాదా ల నియంత్రణకు అవగాహన పెం చుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రమాదాలు, మరణాలకు కారణాలివీ..
–చోదకులు వాహనాలు నడుపు తూ సెల్ఫోన్ వాడటం
–ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాల్ని అతివేగంగా నడపడం
–హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం
–ట్రాఫిక్ సిగ్నళ్లను పట్టించుకోకుం డా వాహనాల్ని నడపడం