Telangana sat : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, అభ్యర్థులకు ‘టి-సాట్’ అండ
సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
నిరుద్యోగులకు గుడ్ న్యూస్, అభ్యర్థులకు ‘టి-సాట్’ అండ
–సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగ యువతకు టి-సాట్ (తెలంగాణ స్కిల్ అకడమిక్ ట్రైనింగ్) నెట్వర్క్ అనునిత్యం అండగా నిలుస్తోంది. పోటీ పరీక్షలు ఏవైనా వాటికి యువతను సమాయత్తం చేయడమే ప్రధాన లక్ష్యం గా పనిచేస్తోంది. ఆ ప్రయ త్నంలో భాగంగానే ‘జనరల్ స్టడీస్ ఫర్ ఆల్’ పేరుతో అన్ని పోటీ పరీ క్షలకూ ఉపయోగపడే కంటెంట్ ఈ నెల 25వ తేదీ సోమవారం నుం డి ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు టి-సాట్ (తెలంగాణ స్కిల్ అకడమిక్ ట్రైనింగ్) సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎ స్సీ) ఆధ్వర్యంలో నిర్వ హించే ప్రతి పోటీ పరీక్షకూ కంటెంట్ అందిస్తున్న టి-సాట్ (తెలం గాణ స్కిల్ అకడ మిక్ ట్రైనింగ్)నెట్వర్క్ కేంద్ర ప్రభు త్వ, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వ హించే పోటీ పరీక్షలకు ఎల్లవేళలా పోటీ పరీక్షల కంటెంట్ అందించిన ఏకైక సంస్థగా పేరుతెచ్చుకుందని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
పోటీ పరీక్షల అవగాహన పాఠ్యాంశాల ప్రసా రాల్లో భాగంగా ఆధునిక సాంకేతిక పరి జ్ఞానంతో కూడిన సుమారు 600 ఎపిసోడ్స్ 10 సబ్జె క్టులకు సంబంధించి 500 రోజులు కంటెంట్ ప్రసారం చేస్తు న్నామని సీఈవో ప్రకటించారు. టి-సాట్(తెలంగాణ స్కిల్ అకడమిక్ ట్రై నిం గ్) నిపుణ ఛానల్ లో మధ్యాహ్నాం 12 నుండి ఒంటి గంట, మూడు నుండి నాలుగు గంటల వరకు, విద్య ఛానల్ లో అదే రోజు రాత్రి ఎనిమిది నుండి 10 గంటల వరకు పున:ప్రసారమౌ తాయన్నారు.
పోటీ పరీక్షల్లో ప్రధాన సబ్జెక్టులైన తెలంగాణ ఉద్యమం, ఇండియన్ హిస్టరీ , మ్యాథ్స్, జాగ్రఫీ, పాలిటీ వంటి సబ్జెక్టులతో పాటు సోషల్ ఎక్స్ క్లూజన్, జనర ల్ ఇంగ్లీష్ వంటి ప్రత్యేక సబ్జెక్టులకు సంబంధిం చిన కంటెంట్ ప్రసారం చేస్తున్నామని సీఈవో వివరించారు. తెలంగా ణ ప్రభుత్వ పక్షాన తాము చేస్తున్న ఈ ప్రయత్నాలు విజయవంతం కావాలంటే పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత తాము ప్రసారం చేసే పాఠ్యాంశా లను సరైన విధంగా ఉపయోగించు కోవాలని సూ చించారు.
టి-సాట్ (తెలంగాణ స్కిల్ అకడమిక్ ట్రై నింగ్) ప్రసారాలు ప్రభుత్వ ఉద్యో గాలు సాధించడంలో మంచి తో డ్పాటు అందించాయని ఉద్యో గాలు పొందిన అభ్యర్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే త మ ప్రయత్నాలకు మంచి ఫలి తాలు వస్తున్నాయన్న ఆనందం కలు గుతోందని సీఈవో వేణుగో పాల్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.
Telangana sat