Tenth Results: ‘పది ‘ ఫలితాలు విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కూడా బాలికలదే పైచే యిగా నిలిచింది. మొత్తంగా పది ఫలితాల్లో 91.31శాతం ఉత్తీర్ణత సాధించగా 3927 స్కూళ్లలో నూరు శాతం ఫలితాలు సాధించారు
ఫలితాల్లో బాలికలదే పై చేయి
బాలికలు 93.23%, బాలురు 89.42% ఉత్తీర్ణత
మొత్తంగా 91.31% ఉత్తీర్ణత, గతేడాదితో పోలిస్తే పెరిగిన శాతం
నిర్మల్ జిల్లా ఫస్ట్, వికారాబాద్ జిల్లా లాస్ట్
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బు ర్రా వెంకటేశం వెల్లడి
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కూడా బాలికలదే పైచే యిగా నిలిచింది. మొత్తంగా పది ఫలితాల్లో 91.31శాతం ఉత్తీర్ణత సాధించగా 3927 స్కూళ్లలో నూరు శాతం ఫలితాలు సాధించారు. 99శాతం ఫలితాలతో నిర్మల్ జిల్లా మొదటి స్ధానంలో నిలువగా వికారాబాద్ చివరి స్ధానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ తరహాలోనే టెన్త్ ఫలితాలలోనూ బాలికలే పై చేయి సాధించారు.
బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ లోని ఎస్సీఈఆర్టీ కార్యాల యంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అది పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. గతేడాదితో పోలీస్తే ఈసారి పాస్ పర్సంటేజ్ భారీగా నమోదైంది. ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షలకు మొ త్తం 5,08,385 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.
గురుకులాల్లో 98.71 శాతం ఉత్తీర్ణత… పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నిర్మల్ జిల్లా 99.5 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా సిద్దిపేట 98.65 శాతంతో రెండో స్థానంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా 98.27 శాతంతో మూడో స్థా నంలో నిలిచింది. 65.10 శాతం తో వికారాబాద్ జిల్లా రాష్ట్రం లోనే చివరి స్థానంలో నిలిచింది.
గతేడాది కూడా నిర్జల్ జిల్లా రాష్ట్రంలో టాప్ ప్లేస్ లో ఉండగా వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఇక 3,927 స్కూల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు పాఠశాలల్లో జీరో శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. ప్రైవేట్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 49.73 శాతం నమోదు కాగా తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థుల్లో 98.71 శాతం ఉత్తీర్ణత సాధించారు.
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ అవకాశాలు… రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం మంగళవారం నుంచి 15 రోజుల్లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికా రులు వెల్లడించారు. రీ కౌంటింగ్ కు రూ.500, రీ వెరిఫికేషన్కు రూ. 1000 రుసుం నిర్ణయించారు.
ఇది లా ఉండగా జూన్ 3 నుంచి సప్లి మెంటరీ పరీక్షలు ప్రారంభం కాను న్నాయి. పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల టైమ్ టేబులు విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థు లు సంబంధింత పాఠశాలల్లో మే 16వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు.
Telangana SSC results released