Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telanganagovernment : రైతులకు శుభవార్త, పంట పెట్టుబడి సాయం మార్గదర్శకాలు జారీ

రైతులకు శుభవార్త, పంట పెట్టుబడి సాయం మార్గదర్శకాలు జారీ

Telanganagovernment : ప్రజా దీవెన, హైదరాబాద్: రైతు భరోసా పథకిం కింద రైతులకు ఈనెల 26 వ తేదీ నుంచి పంట పెట్టుబడి సహాయం అందించ డానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందిం చనున్నట్టు ఉత్తర్వుల్లో (జీవో ఆర్టీ నంబర్ 18 / తేదీ 10-01-2025) పేర్కొంది.

రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం కావాల న్న ఉద్దేశంతో గతంలో రుణమాఫీ మార్గదర్శకాలపైన తెలుగులో జీవో జారీ చేసిన ప్రభుత్వం రైతు భరోసా జీవోను కూడా తెలుగులో వెలువ రించింది.