Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TelanganaGovernment: స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తెలంగాణ

--సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్ లో యువతకు శిక్షణ --2030 నాటికి 10వేల మందికి స్ర్పింగ్ సెమీ కండక్టర్స్ అంగీకారం --రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి శ్రీధర్ బాబు వెల్లడి

 

TelanganaGovernment: ప్రజా దీవెన, హైదరాబాద్: “స్కి ల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ’గా తెలంగాణ ను మార్చేందుకు సీఎం రే వంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్ర ణాళికాబద్ధంగా చిత్త శుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడు లు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న యూకేకు చెందిన సెమీ కండక్టర్ దిగ్గజ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులతో ఆయన బుధవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం లో భేటీ అయ్యారు.

పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ లో ఉన్న అనుకూలతలు, పారిశ్రా మికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అం దిస్తున్న ప్రోత్సాహాకాలను ఈ సం దర్భంగా వివరించారు. ‘సెమీ కండ క్టర్ల తయారీ, డిజైనింగ్ లో దిగ్గజ సంస్థగా ఉన్న ఆర్మ్ హోల్డింగ్స్ రా ష్ట్రంలో పెట్టుబడులు పెట్టేం దుకు ఆసక్తి చూపించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. తె లంగాణ రైజింగ్ లో భాగస్వామ్యయ్యేందుకు ముందుకొచ్చి నందు కు ప్రత్యేక ధన్య వాదాలు. పరిశ్రమ ఏర్పాటులో అన్ని రకాలుగా అండగా ఉంటాం’ అని హామీ ఇచ్చారు.

మాకున్న పెద్ద ఆస్తి యువత. వారిలో ప్రతి భకు కొదువ లేదు. కొం చెం సానబె డితే మెరికల్లా తయారవు తారు. పరిశ్రమలకు అవ సరమైన రెడిమేడ్ మానవ వనరులను అందించే బాధ్యతను యం గ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా మా ప్రభుత్వం తీసుకుం దని వివరిం చారు. ‘సెమీ కండక్టర్ల తయారీ, డి జైనింగ్ లో ఉన్న డిమాండ్ కు అను గుణంగా తెలంగాణ యువతను తీర్చి దిద్దేం దుకు ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగ స్వామ్యం కావాలన్నది మా ఆకాంక్ష. 10వేల మంది యువత శిక్ష ణనిచ్చే బాధ్యతను తీసుకోవా లి’ అని సమావేశానికి హాజరైన మ లేషియాకు చెందిన దిగ్గజ సంస్థ స్ర్పింగ్ సెమీ కండక్టర్స్ (Spr ing Semi Conductors) సీఈవో కెన్ కూను కోరారు.

‘తెలంగాణను స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్ర భుత్వం చేస్తున్న కృషి అభినందనీ యం. మా వంతుగా ఇక్కడి యువ తను సెమీ కండక్టర్ల తయారీ, డిజై నింగ్ లో అత్యుత్తమ మానవ వన రులుగా తీర్చి దిద్దేలా ప్రత్యేక కరి క్యులమ్ ను రూ పొందిస్తాం. విద్యా సంస్థల సహకారంతో ఆరు నెలలు ఇక్కడ శిక్షణ, మిగిలిన కాలం తైవా న్, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల్లో ఇంటర్న్ షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

టీ కన్సల్ట్ సహకారంతో 2030 నా టికి 10వేల మంది యువతకు శిక్ష ణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొంది స్తాం’ అని కెన్ కూ మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. సానుకూలం గా స్పందించిన కెన్ కూ మంత్రి ప్ర త్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీ కన్సల్ట్ ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా, వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ మలే షియా విభాగం ప్రెసిడెంట్ మారుతీ, ఇతర ప్రతినిధులు మహేష్ నటరాజ్, వాకిటి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.