Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

telanganapaperleakcase : బిగ్ బ్రేకింగ్, ‘పది ‘ లీకేజీ నింది తుల అరెస్ట్

బిగ్ బ్రేకింగ్, ‘పది ‘ లీకేజీ నింది తుల అరెస్ట్

telanganapaperleakcase:   ప్రజా దీవెన, నల్గొండ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన పదవ తరగతి పేపర్ లీకే జీ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణ కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో పే పర్ లీకేజ్ కి కారణమైన వ్యక్తుల ను అరెస్టు చేశామని ఎవరి ఒత్తిడి లేకుండా విచారణ నిష్పక్షపా తంగా, పారదర్శకంగా జరుగుతుం దని నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి తెలిపారు. కేసు కు సంబంధించి నిందితుల వివరాలను ప్రకటన రూపంలో వెల్లడించారు.

డీఎస్పీ తెలి పిన వివరాల ప్రకారం గత 21వ తేదీన పదవ తరగతి మొదటి (తెలుగు) పరీక్ష 09.30 గంటల నుండి 12.30 గంటల వరకు నిర్వ హించబడింది. ఈ పరీక్ష మొదలైన అరగంట తర్వాత వాట్స్ అప్ లో తెలుగు ప్రశ్నా పత్రము చక్కర్లు కొడుతు విషయం జిల్లా విద్యాశాఖ అధికారికి చేరింది. ఆ వెంటనే డిఇఓ ఎంఈఓ కు ఫోన్ చేసి వెం టనే విచారణ చేపట్టాలని ఆదేశించారు.

ఎంఈఓ నకిరేకల్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలిక ల గురుకుల పాఠశాల లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో రూమ్ నంబర్ 8 వద్ద ఉదయం 9.50 గంటలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కిటికీ వద్ధకు వచ్చి పరీక్ష రాస్తున్న అమ్మాయి వద్ధ ఆమె ప్రశ్నా పత్రము సెల్ ఫోనులో ఫోటో తీసుకుని వెళ్ళినాడని నిర్ధారిం చుకొని ఎంఈఓ పై అధికారులతో పాటు నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఎంఈఓ ఫిర్యాదు మేరకు సిఆర్ నెంబర్ 77/2025 యూ / ఎస్ 318(2), 318(3), 353(2), 223 బి ఎన్ ఎస్ అండ్ సెక్షన్ 8 ఆఫ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 1997 ప్రకారము కేసు నమోధు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకొని విచారించా రు. ఇందులో నేరస్తులు ఏ 1 నుండి ఏ 4 వరకు, ఏ 6 నుండి ఏ 11 అండ్ CCL1 అoదరూ స్నేహితులు.

పదవ తరగతిపరీక్షలకు హాజరయ్యే వారి బం ధువులకు అక్రమ మార్గాల ద్వారా ఎక్కువ మార్కులు రప్పించాలనే ఉద్దేశ్యంతో వా రందరూ కలిసి పరీక్ష మొదలైన తర్వాత ఎక్కడైనా ప్రశ్నా పత్రము దొరుకుతుందేమోనని వెతికారు. ప్రశ్న పత్రం దొరికిన వెంటనే జవా బులు వ్రాసి వారికి తెలిసిన వారికి ప్రశ్నలకు సమా ధానాలు అంధిం చి ఎక్కువ మా ర్కులు పొందాలనే ఉద్దేశ్యంతో ఏ1, ఏ 3, సిసిఎల్ 1 లు ముగ్గురు కలిసి నక్రేకల్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల వద్దకు ఉదయము 9.40 గంటలకు స్కూటి మీద వచ్చారు.

అక్కడ గేట్ వద్ధ అప్పటికే పోలీసు వారు వున్నంధున లోపలికి వెళ్ల డానికి వీలు కాక పోవడంతో వెంటనే వీరు ముగ్గురు స్కూల్ వెనుక వైపునకు వెళ్లారు. అక్కడ ఏ11 కూడా వుం డటంతో సిసిఎల్ 2 పాఠ శాల వెను క గోడ కిటికీ వైపు ఉన్న 1 వ అంత స్తులో రూము నెంబరు 8 లో పరీక్ష రాస్తుండగా అది గమనించిన ఏ1 1 అందులో పరిచయం ఉన్న వి ద్యార్థిని ఉండటంతో ప్రశ్నా పత్రాన్ని చూపిం చ మని సిసీఎల్ 2 సైగ చేయగా ఆమె అందుకు ఒప్పుకోగా వెంటనే సిసిఎల్ 1, ఏ1 ఇద్దరు కలిసి ఏ11 సహాయంతో అక్కడ ఉన్న ప్రహరీ గోడ ఎక్కి సిసిఎల్ 2 వున్న కిటికీ వద్ధకు వెళ్ళగా ఆమె ప్రశ్నా పత్రాన్ని చూపించింది.

సి సిఎల్ 1 తన ఫోనులో తెలుగు ప్రశ్నా పత్రాన్ని ఫోటో తీసుకుని వెంటనే ఇద్దరు కింధికి దిగారు. ఆ ఫోటోలను సిసిఎల్ -1 నుండి మిగతా నేరస్తులకు ఒకరి నుండి ఒకరికి పంపుకోగా ఆ పేపర్ లో వున్న ప్రశ్నలకు ఏ4 ద్వారా స మాధానాలు తయారు చేసి వాటిని ఏ5 మూసి ఉన్న జీరాక్సు షాప్ లో జీరాక్సు తీసుకున్నారు. నే రస్తులు వారికి తెలిసిన వారికి ఇవ్వడానికి పరీక్షా కేంద్రానికి వెళ్ళ గా అక్కడ వున్న పోలీసు వారిని చూసి దొరికి పోతామేమోనని వె ళ్ళిపోయినారు.

ఎంఈఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మొ త్తం 13 మందిని అదుపులోకి తీసు కొని విచారించి గత 23వ తేదీన నిందితులైన ఏ1 నుండి ఏ5, సిసి ఎల్ 1 (బాల నేరస్థుడు ) లను అరె స్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. మిగిలిన నిందితులపై విచార ణ కొనసాగుతుంది. కాగా మొత్తం 13 మంది నిందితుల్లో ఆరుగు రుని రిమాండ్ కు తర లించగా మరి ఆరుగురు పై విచారణ కొనసా గుతుంది ఒకరు పరా రీలో ఉన్నారు. మొత్తం 13 మం దిలో ఇద్దరు బాల నేరస్తులు ఉ న్నారని కేసు విచారణ నిష్పక్ష పాతంగా పార దర్శకంగా కొన సాగుతుందని డిఎస్పి తెలిపారు.

*నేరస్తుల వివరాలు ఇలా ఉన్నాయి…* ఏ1 చిట్ల ఆకాష్ , ఏ2 చిట్ల శివ తండ్రి సైదులు, ఏ 3బండి శ్రీను, ఏ 4 గుడుగుంట్ల శంకర్, ఏ5 బ్రహ్మదేవర రవిశంకర్, ఏ6 పోగుల శ్రీరాములు, ఏ7తలారి అఖిల్ కుమార్, ఏ8ముత్యాల వంశీ, ఏ9 పలాస అనిల్ కుమార్, ఏ 10 పళ్ల మనోహర్ ప్రసాద్ , ఏ11 రాహుల్ నకిరేకల్ పట్టణం పరా రీలో ఉండగా, సిసిఎల్ 1 బాల నేరస్థుడు ను జువెనైల్ బోర్డు ముం ధర హాజరు పర్చగా, సిసిఎల్ 2 (బాల నేర స్థుడు) ఉన్నాడు.