సర్వీస్ రివాల్వర్లో కాల్చుకుని ఎస్సై మృతి
ప్రజా దీవెన, ములుగు: పోలీస్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చు కుని ఓ ఎస్సై ప్రాణాలు విడిచిన విషాద ఘటన ములుగు జిల్లాలో సోమ వారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీస్ శాఖ పరంగా తె లిసిన వివరాల్లోకి వెళితే.. వాజేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టే షన్లో రుద్రారపు హరీశ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఏటూరు నాగారం మండల పరిధిలోని ముళ్లకట్ట బ్రడ్జి సమీపంలో ఉన్న ఓ రిసార్ట్ లో హరీశ్ తన సర్వీస్ రివాల్వర్తో కా ల్చుకుని ప్రాణాలు విడిచాడు.ములుగు జిల్లాలో నిన్న ఉదయం జరి గిన భారీ ఎన్ కౌంటర్ తర్వాత వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకో వడం కలకలం లేపుతుంది, ఉన్నంత అధికారులు సంఘటన స్థలా నికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Telanganapolice