Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Food Poisoning : వనస్థలిపురంలో కలకలం..ఓ కు టుంబంలో ఫుడ్ పాయిజన్..ఒకరి బలి 

Food Poisoning :ప్రజా దీవెన,హైదరాబాద్: హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించిoది. ఒకే కుటుంబంలో 8 మందికి ఫుడ్ పాయిజన్ జరిగి ఒక రిని బలి తీసుకుంది. ఎల్బీనగర్ చింతలకుంటలో ఘటన చోటుచే సుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాం తంలో భయాందోళనలు నెలకొన్నా యి.

 

ఓ కుటుంబం బోనాల పండుగ రో జు తెచ్చుకున్న మటన్ ను వండి ఆ రగించిన తర్వాత ఫ్రిజ్లో నిల్వ చే సింది. మరుసటి రోజైన మంగళవా రం మటన్ ని తిరిగి తినడంతో ఫు డ్ పాయిజన్ కు గురైనట్లు సమా చారం. అయితే కుటుంబం కుటుం బం ఫుడ్ పాయిజన్ కు గురి కావ డంతో అందులో ఒకరు ఆర్టీసీ ఉ ద్యోగి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఏడుగురు కు టుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి వి షమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అనారోగ్యం పాలైన వారిని చింతలకుంటలోని ఓ ప్రయి వేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కాగా వీరిలో ఇద్ద రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తె లుస్తోంది. మరికొన్ని పూర్తి వివరా లు తెలియాల్సి ఉంది.