— ఇందిరమ్మ రాజ్యంలో పేదలు సు భిక్షంగా ఉండాలనే సన్నబియ్యం
–సాగర్,శ్రీశైలం ,మూసీ ప్రాజె క్టుల తో నల్గొండ రైతులకు నీళ్లు ఇ చ్చిం ది కాంగ్రెస్ పార్టీ
–బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలన లో ఏ ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వలే దు
— గోదావరి జలాలు మూడు రోజుల లో తీసుకవస్థానంటే గ్లాస్ లో సోడా కలిపినట్లా
–స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కా ర్యకర్తల్ని గెలిపించే బాధ్యత మాది
–రైతులకు బోనస్, సన్నబియ్యం, భరోసా, రుణ మాఫీ లాంటి పథకా లు ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం
–నల్గొండ జిల్లాలో ఒక గంజాయి మొక్క ఉంది వచ్చే ఎన్నికల్లో పీకే యాలి
–స్థానిక సంస్థల ఎన్నికల్లో గొప్ప మె జారిటీతో పార్టీని గెలిపియించాలి
–తిరుమలగిరిలో రేషన్ కార్డుల పం పిణి కార్యక్రమoలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ప్రజా దీవెన, సూర్యాపేట: తెలం గాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఏ ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి గుక్కెడు ముద్ద పెట్టా లని ఆలోచన సైతం గత ప్రభుత్వ పెద్దలు చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ షా పులు తెరవలేదని, బెల్ట్ షాపులు తె రిచారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిం చారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తుంటే ఓర్వలేక తమ ప్ర భుత్వంపై , మాపై ప్రతిపక్షాలు వి మర్శలు చేస్తూ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం సాయం త్రం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమా న్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అదే సందర్భంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప న, రూ.34.20 కోట్ల విలువైన పను లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిం చారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నామని, బోనస్ సైతం ఇస్తున్నామని చెప్పా రు. రేషన్ కార్డు అంటే పేదవారి ఆ త్మగౌరవం గుర్తింపు అని ఈ సంద ర్భంగా ఆయన అభివర్ణించారు.
పేదల ఆకలి తీర్చే ఆయుధమే రేష న్ కార్డు అని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రా జె క్టుల వల్లే నేడు నల్గొండ జిల్లాకు నీ ళ్లు వస్తున్నాయని గుర్తు చేశారు. రై తులకు రూ.2లక్షల రుణమాఫీ చే స్తామని చెప్పామని ఈ హామీని త మ ప్రభుత్వం చేసి చూపించింద న్నారు. అయితే తమ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టిందంటూ దు ష్ప్రచారం చేశారని ప్రతిపక్షాలపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. కానీ కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతులకు రైతు భరోసా నగదు అందించామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తె లంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉం దని తెలిపారు.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం ప్రవేశపెట్టిన 18 నెలల కా లంలోనే రూ. 6,500 కోట్లు ఖర్చు అయిందని వివరించారు. తమ ప్ర భుత్వం కొలువు తీరి రెండేళ్లు పూర్త య్యే సరికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రక టించారు.
కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలే శ్వరం అయ్యింది… కేసీఆర్ కట్టి న కాళేశ్వరం ఆయన హయాంలోనే కూలేశ్వరం అయ్యిందని ఎద్దేవా చే శారు. కూలేశ్వరం ప్రాజెక్టు దగ్గరే వారిని ఉరి తీసినా తప్పు లేదన్నా రు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? అంటూ బీఆర్ఎస్ నేతలకు ఈ సం దర్భంగా సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మాజీ మం త్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీ శ్ రెడ్డి పై సీఎం తీవ్రస్థాయిలో మం డిపడ్డారు. మూడు అడుగులున్న స్థానిక నేత ఎగిరెగిరి పడుతున్నా రని ఎద్దేవా చేశారు. పదేళ్లు అవ కాశం ఇచ్చినా తుంగతుర్తికి నీళ్లు ఎందుకు తేలేదంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సీఎం సూటిగా ప్ర శ్నించారు. తుంగతుర్తికి నీరు తేవ డమంటే గ్లాస్లో సోడా పోసినట్లు కాదంటూ బీఆర్ఎస్ నేతకు ఈ సందర్భంగా చురకలంటించారు. దొ ర ముందు చేతులు కట్టుకుని గ్లాస్ లో సోడా పోయడమే నీకు తెలుసం టూ మండిపడ్డారు.సొంత మండ లానికి ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీ స్లే కాదు, పోలీస్ స్టేషన్ సైతం తె చ్చుకోలేని ఘనత బీఆర్ఎన్ నేత లదంటూ వ్యంగ్యంగా అన్నారు.
పోరాట యోధులను అందించిన గడ్డ నల్గొండ అని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. నాడు గంజికి లేని మూడు అడుగు ల నాయకుడు, నేడు బెంజి కార్లలో తిరుగుతున్నారంటూ జగదీశ్వర్ రెడ్డిపై వ్యంగ్య బాణాన్ని సీఎం రేవం త్ రెడ్డి సంధించారు. తెలంగాణలో కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా 11.3 లక్షల మందికి లబ్ధి చేకూరతుంద న్నారు. తెలంగాణలో మొత్తం 95. 56 లక్షల మంది రేషన్ కార్డులు అం దుకున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.