— రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Thin Rice : ప్రజా దీవెన , దేవరకొండ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆయన న ల్గొండ జిల్లా కొండమల్లేపల్లి, దేవర కొండ మండలాలలో జాతీయ ఆ హార భద్రత చట్టం- 2013 అమలు తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా దేవరకొండ ఏరి యా ఆసుపత్రిలో మీడియా ప్రతి నిధులతో మాట్లాడుతూ దేవర కొండ, కొండమల్లేపల్లి మండలా లలో రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు ,పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యం పట్ల ప్రజలు సంతో షంగా ఉన్నారని, అందరు మెచ్చు కుంటున్నారని అన్నారు.
అంత్యోదయ కార్డులకు పంచదార కేటాయించాలని ప్రజలు కోరారని, అదేవిధంగా చౌకధర దుకాణాల లో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు వం టి అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అంగ న్వాడి కేంద్రంలో చిన్నపిల్లలు, గర్భి ణీ స్త్రీలకు పౌష్టికాహార పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు బాగు న్నాయని, అలాగే దేవరకొండ మై నార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, గిరి జన బాలికల వసతి గృహం, వెను కబడిన తరగతుల బాలుర వసతి గృహాలలో తనిఖీలు నిర్వహించి అక్కడ మెనూ ప్రకారం భోజనం, ఇతర సౌకర్యాలను తనిఖీ చేశా మని, నిబంధనల ప్రకారమే విద్యా ర్థులకు కల్పిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో అధికారులు ,సిబ్బంది బాగా పని చేస్తున్నారని, దీని ద్వారా జిల్లా యంత్రాంగం పనితీరు పట్ల ఆయన అభినందన తెలియజేశారు.
దేవరకొండ ఏరియా ఆసుపత్రి లో రోగులకు అందిస్తున్న భోజనాన్ని, వంటగదిని, స్టోర్ రూమ్ ను ఆయ న కమిషన్ సభ్యులతో కలిసి తని ఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏరియా ఆసుపత్రి 100 పడకల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం 180 మంది వస్తున్నారని , 200 పడకల కోసం ప్రభుత్వానికి సిఫా రసు చేసామని డిసిహెచ్ మాతృ నాయక్ తెలిపారు. అయితే రాష్ట్ర ఆహార కమిషన్ ద్వారా 200 పడ కల ఆసుపత్రిగా స్థాయి పెంచేం దుకు తమ వంతు కృషిగా లేఖ రాస్తామని చైర్మన్ తెలిపారు.
అంతకుముందు రాష్ట్ర ఆహార కమిషన్ దేవరకొండలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు .6 వ తరగతి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి ఆహార కమిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, భోజనం బాగుం దా? గుడ్డు ఇస్తున్నారా ?నాన్ వెజ్ ఎప్పుడు పెడుతున్నారని? విద్యా ర్థులను ప్రశ్నించారు.
విద్యార్థినిలకు అప్పుడప్పుడు రక్త పరీక్షలు నిర్వహించాలని, దీని ద్వారా రక్తహీనతను తెలుసుకొని వారికి సరైన వైద్యం అందించే అవ కాశం ఉంటుందని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు.అనంతరం బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శిం చి వంటగదిని తనిఖీ చేశారు. ఉద యం అల్పాహారం ఏమిచ్చారని? అడగగా టమాట రైస్, సాంబార్ ఇచ్చామని వంట మాస్టర్ తెలి పారు.72 మంది విద్యార్థులు ఈ హాస్టల్ లో ఉన్నారని, వార్డెన్ ఇ మ్మానియేల్ తెలుపగా, గుడ్లు ఎలా ఇస్తున్నారని? సైజు ఎలాంటివిస్తు న్నారని? అడగడమే కాకుండా స్టోర్ ను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి రికార్డు లను నిర్వహించాలని, ఒకవేళ వారు పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నట్లయితే కమిషన్ ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేసి సరైన భోజనం ఇచ్చే విధంగా చర్య లు తీసుకుంటామని తెలిపారు.
ఆ తర్వాత కమిషన్ మైనార్టీ రెసిడెన్షియల్ సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. కాగా ఇక్కడ విద్యార్థులకు అమలు చేస్తున్న మెనూ, భోజనం, ఇతర వివరాలను మైనార్టీ సంక్షేమ అధికారి విష్ణు కమిషన్ కు వివరించారు. ఇక్కడ అమలు చేస్తున్న మెనూ, భోజనం ఇతర విషయాల పట్ల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.
రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు శారద, భారతి, జ్యోతి, దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి, బీసీ సంక్షే మ అధికారి ఖాజా నజీమ్ అలీ, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ కళ్యా ణ చక్రవర్తి, ఏరియా ఆసుపత్రి సూ పరిండెంట్ డాక్టర్ రవి తదితరులు ఉన్నారు.