house collapsed ఇంటి గోడ కూలి ముగ్గురి దుర్మరణం
-- ఇటీవల వర్షాలకు తడిసిన ఇల్లు -- గోడ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సంఘటన -- సూర్యాపేట జిల్లా నాగారంలో ఘోరం
బిగ్ బ్రేకింగ్…
ఇంటి గోడ కూలి ముగ్గురి దుర్మరణం
— ఇటీవల వర్షాలకు తడిసిముద్దైన ఇల్లు
— ఘాడనిద్రలో ఉండగా అర్ధరాత్రి సంఘటన
— సూర్యాపేట జిల్లా నాగారంలో ఘోరం
ప్రజా దీవెన/ సూర్యపేట: సూర్యాపేట జిల్లాలో ఇటీవల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా తడిసి ముద్దయిన ఓ ఇల్లు ఆ ముగ్గురి ప్రాణాలను హరించింది. జిల్లాలోని నాగారం మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ హృదయ విదారక గతంలో ముగ్గురు మృతి చెందారు. వర్షాలకు బాగా నాని ఇల్లు గోడ కూలి రాత్రి గాడ నిద్రలో ఉండగా గోడ కూలి మీద పడడంతో శీలం రాములు(85),శీలం రామక్క(70), శీలం శ్రీను(38) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి ఇల్లు చుట్టుప్రక్కల మొత్తంగా పాత ఇండ్లు ఉన్న కారణంగా ఎవరు గమనించలేదు. ఈరోజు గురువారం మధ్యాహ్నం అక్కడ ఉన్న కొంతమంది గమనించడంతో విషయం బయటపడింది. కరెంట్ బిల్లు వసూలు కోసం వెళ్లిన కరెంటు సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ శివశంకర్ ఎస్ఐ ముత్తయ్యలు స్థానికుల సహాయంతో మృతదేహాలు వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తాసిల్దార్ బ్రహ్మయ్య పంచినామా నిర్వహించి ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి గోడలు నాని ఇల్లు కూలి ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుడు శ్రీనుకు ఇద్దరు కుమారులు ఒక కూతురు భార్య ఉన్నారు.ఒకే కుటుంబానికి చెందిన తల్లి తండ్రి కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.