Three Person మహానగరంలో ముగ్గురు మృతి
-- నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ప్రమాదం -- కెపిహెచ్ బి పరిధిలోని అడ్డగుట్టలో దుర్ఘటన
మహానగరంలో ముగ్గురు మృతి
— నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ప్రమాదం
— కెపిహెచ్ బి పరిధిలోని అడ్డగుట్టలో దుర్ఘటన
ప్రజా దీవెన/ హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏకంగా ముగ్గురు మృతి చెందిన తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన గురువారo ఉదయం జరిగింది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి అడ్డగుట్ట కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలగా ఏకంగా ముగ్గురు మృతి చెందారు.
ఐదవ అంతస్తు గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు గుర్తించారు. ముగ్గురు మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా హైదరాబాద్ మహానగరంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెర్పిలేకుండా వర్షాలు పడుతున. భారీ వర్షాల నేపథ్యంలోనే గోడ తడిసి కూలిపోయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.