–ప్రధాని ఆశయాలకు అణుగుణం గా అడుగులు
–2047 నాటికి రాష్ట్ర పచ్చదనాన్ని 50 శాతానికి పెంచాలి
–అందుకు దూకుడుగా అడవుల పెంపకానికి చర్యలు తీసుకోవాలి
–పునరుత్పాదక ఇంధన సామర్ధ్య చర్యలపై తెలంగాణ గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
Telangana Governor Jishtu Dev Verma : ప్రజా దీవెన, హైదరాబాద్: పెరుగు తున్న వాతావరణ పరిస్థితుల నేప థ్యంలో భూతాపాన్ని తగ్గించేందుకు దేశ ప్రధాని పిలుపుమేరకు త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగాలని గ వర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాష్ట్ర ప్రజల కు పిలుపునిచ్చారు. బీఈఈ దక్షిణ భారత ప్రాంతీయ మీడియా సలహా దారు ఎ. చంద్ర శేఖర రెడ్డి, ఈఈఎ స్ఎల్ సీనియర్ అధికారులతో కలి సి శుక్రవారం ఇంధన సామర్థ్య రం గంలో కీలక పరిణామాలపై గవర్న ర్ను కలిసి వివరించారు. ఈసంద ర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడారు.
గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను త గ్గించడానికి ప్రభుత్వాలతో పాటు ప్ర జలు కూడా ప్రత్యేక దృష్టి సారించా లని కోరారు. ఈ విధానం ఆర్ధిక, ప ర్యావరణంతోపాటు సమాజానికి గ ణనీయంగా ప్రయోజనం చేకూరు స్తుందని నొక్కి చెప్పారు. వాతావర ణ చర్యలపై ప్రపంచ సమాజాన్ని ఏ కం చేసే దేశీయంగా, అంతర్జాతీ యంగా ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగం గా పలు కీలక రంగాలలో సమన్వ యంతో కూడిన ప్రయత్నాల అవస రాన్ని ఆయన నొక్కి చెప్పారు.
అన్ని విభాగాల ప్రత్యక్ష ప్రమేయం
పునరుత్పాదక విద్యుత్ని ప్రోత్స హించడం, ఇంధన సామర్థ్య చర్య లను వేగవంతం చేయడంలో విద్యు త్, రవాణా, భవనాలు, గ్రామీణ మ రియు పట్టణాభివృద్ధి, పరిశ్రమలు మరియు చిన్న మరియు మధ్య త రహా సంస్థలు (ఎస్ఎంఈ) సహా అ న్ని సంబంధిత విభాగాల ప్రమేయం అవసరమన్నారు. వాతావరణ మా ర్పు ప్రభావాలను తగ్గించడంలో ఇం ధన సామర్థ్యం మాత్రమే 40 శాతం కంటే ఎక్కువ దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రంగంలో ప్రపంచ ఉత్తమ పద్ధతుల తో పాటు క్లీన్ టెక్నాలజీలను అమ లు చేయడంలో పూర్తిస్థాయి మద్ద తు ఇచ్చినందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఎనర్జీ ఎఫి షియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈ ఈఎస్ఎల్), పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖల సమిష్టి ప్రయత్నాలను గవ ర్నర్ ప్రశంసించారు.
సోలార్ ఎనర్జీని వినియోగించడం లో మహిళలను భాగస్వామ్యం చేయడానికి తెలంగాణ ప్రభుత్వ చొరవలను కూడా ఆయన ప్రశం సించారు.
ఈ సందర్భంగా బీఈఈ దక్షిణ భా రత దేశ మీడియా సలహాదారు ఏ చంద్రశేఖర రెడ్డి ఇంధన సామర్ధ్య చర్యలను ప్రోత్సహించడంలో భా గంగా బీఈఈ ప్రమాణాలు మరి యు లేబులింగ్ (ఎస్ అండ్ ఎల్) కార్యక్రమం యొక్క పరిధిని గవర్న్ కు వివరించారు, వీటిలో 39 ఉపక రణాల వినియోగం ఉండగా వాటి లో 16 తప్పనిసరిగా ఉండాలని చె ప్పారు. వీటిలో ఎయిర్ కండిషన ర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు మొదలై నవి ఉంటాయని తెలిపారు. భారత దేశ ఇంధన సామర్థ్యానికి సంబం ధించిన కార్బన్ ఉద్గారాల తగ్గిం పులలో 60 శాతం దోహదపడుతుం దన్నారు. ఎస్ అండ్ ఎల్ కార్యక్ర మం ద్వారా 2030 నాటికి 1 బిలి యన్ టన్నుల ఉద్గారాలను తగ్గిం చాలనే దేశ వ్యాప్త లక్ష్యాలకు అను గుణంగా పనిచేస్తున్నామని వివరిం చారు.
రాజ్భవన్, జేఎన్టీయూలలో ఇం ధన ఆడిట్ క్షేత్ర స్థాయిలో ఇంధన సామర్ధ్య చర్యల ప్రాముఖ్యతను గు ర్తించిన గవర్నర్ ఈఈఎస్ఎల్ ద్వా రా రాజ్ భవన్, జవహర్లాల్ నె హ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) లలో సమగ్ర ఇంధ న ఆడిట్ నిర్వహించాలని సిఫార్సు చేశారు, వాటిని మోడల్ ఇంధన -స మర్థవంతమైన క్యాంపస్లుగా మా ర్చే సాధ్యాసాధ్యాలను అంచనా వే యాలని సిఫార్సు చేశారు. ఇది కేవ లం ప్రణాళిక కాదు చర్య తీసుకో వాల్సిన సమయం అంటూ ఆయన నొక్కి చెప్పారు. దేశంలోనే తెలంగా ణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్గా త యారుచేసేందుకు ఇంధన సామర్ధ్య అధికారలు ముందుండి నడిపించా లని కోరారు.
ఈ సందర్భంగా ఈఈఎస్ఎల్ సీని యర్ అధికారులు ఆదేశ్ సక్సేనా (జీఎం), జయ ప్రకాష్ వుడుటలు రాజ్భవన్తోపాటు జేఎన్టీయూ లో పక్షం రోజుల్లో ఇంధన ఆడిట్ నివేదికను పూర్తి చేస్తామని గవర్నర్ కు హామీ ఇచ్చారు.
వాతావరణ రోడ్మ్యాప్లో భాగం గా గవర్నర్ ప్రతిపాదనలు….2047 నాటికి తెలంగాణ పచ్చదనాన్ని 50 శాతానికి పెంచాలనే దీర్ఘకాలిక ల క్ష్యంతో అటవీ మరియు పర్యావర ణ శాఖ నేతృత్వంలో చెట్టు నాటే కార్యక్రమాలను ముమ్మరం చేయ డం.ఇంధన పరిరక్షణ, స్థిరమైన ఇం ధన పద్ధతులను ప్రోత్సహించడా నికి పాఠశాలలు, కళాశాలలు మరి యు విశ్వవిద్యాలయాల ద్వారా పె ద్ద ఎత్తున అవగాహన కల్పించడం. అందులో మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్టేక్ హో ల్డర్స్కు సామూహికంగా అవగాహ న కల్పించడం. ఇంధన- సమర్థవం తమైన సాంకేతికతల విధానాలను కింది స్థాయి వరకూ అమలు చేయ డానికి అవసరమైన చర్యలు చేపట్ట డం.