Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Thummala Veera Reddy: అంబేద్కర్ పై అనుచిత మాటలు ఉపసంహరించుకోవాలి

— సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాము. జిల్లా సిపిఎం మండల కార్యదర్శిల సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అత్యుత్తమ పదవి లో ఉండి చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అమిత్ షా అన్ని వర్గాల ప్రజల కోసం రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన అంబేద్కర్ను కించపరి చే వ్యాఖ్యలు చేయడం ఆయన హోదాకు తగదని వారు అన్నారు.

అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29 తేదీన జిల్లా కేంద్రంలో30 తేదీన మండల, పట్టణ కేంద్రాలలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జయప్రదం చేయాలని తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు అమిత్ షా వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలు దెబ్బ తీయడమేనని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించలేదని వారు అన్నారు. అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా మండల కేంద్రాలలో ఆందోళనలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు వామపక్ష పార్టీల శ్రేణులు,ప్రజాస్వామ్యవాదులు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య అధ్యక్ష తన జరిగిన సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాక ర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు v వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు Md సలీం, పీ నర్సిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, ఏ శంకరయ్య, ఎం రవి నాయక్, ఎం గౌతంరెడ్డి, ఆర్ వెంకన్న, ఆర్ శ్రీనివాస్,శశిధర్ రెడ్డి, వినోద్ నాయక్, పెంజర్ల సైదులు, చంద్రమౌళి, సిహెచ్ బయన్న సిహెచ్ మల్లయ్య, జిట్టా సరోజ మండల కార్యదర్శలు నల్ల వెంకటయ్య, అవత సైదులు, నలపరాజు సైదులు, Nనాగరాజు, లూర్డు మారయ్య, కానుగు లింగస్వామి, బిక్షం సాగర్ల మల్లేష్, ఏర్పుల యాదయ్య రవి నాయక్ నాయకు కత్తుల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.