Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tirupamma Sudhir: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా ఏపూరి తిరుపమ్మ సుధీర్ నియామకం

ప్రజా దీవెన ,కోదాడ: కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కి జీవో నెంబర్ 902 ద్వారా నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది ఈ మేరకు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నడిగూడెం మండలం కేంద్రానికి చెందిన ఏపూరి తిరుపమ్మ సుధీర్ ను, వైస్ చైర్మన్ గా కోదాడ పట్టణానికి చెందిన షేక్ బషీర్ తో పాటు 16 మంది డైరెక్టర్లతో నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము నుండి ఆదేశాలు వెలువడ్డాయి.

ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా ఎన్నికైన ఏపూరి తిరపమ్మ సుధీర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తమకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా అవకాశం కల్పించిన మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డికి, కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డికి ,పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిగా వ్యవసాయ కుటుంబంలోని నుండి వచ్చిన మహిళగా శక్తివంచన లేకుండా కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు