Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TMU : సమ్మెకు సైరన్ కు సమయం ఆస న్నం, ఏ క్షణమైనా నిరవధిక సమ్మె

— కొనసాగుతోన్న టీఎంయూ విస్తృ త స్థాయి సమావేశం

TMU : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో సమ్మె సైరన్ మోగేందుకు సమయం ఆసన్నమైంది. సంస్థలో కొనసాగు తోన్న పరిస్థితులు ఇoదుకు నిదర్శ నoగా నిలుస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో టీఎంయూ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుం డడమే సమ్మె సైరన్ మోగేందుకు గడియలు దగ్గర పడుతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సొసైటీ సమావేశం అనంతరం సోమవారం
లేబర్‌ కమిషన్‌ ఎదుట యాజమా న్యంతో చర్చలు జరిపి తద్వారా 21 డిమాండ్లు నెరవేర్చాలని జేఏసీ డిమాండ్‌ చేస్తోంది. కార్మికులను ప్రలోభ పెట్టే ప్రయత్నంలో యాజ మాన్యంహక్కుల సాధనకే ప్రాధా న్యతనిస్తున్న ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీలో అలజడి మొదలైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆర్టీసీ యాజ మాన్యంతో అమీ.. తుమీ తేల్చుకు నేందుకు కార్మిక సంఘాలు సిద్ధమ వుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ఆర్టీసీ లో కీలకమైన టీఎంయూ రాష్ట్రస్థా యి విస్తృత సమావేశాన్ని నిర్వహి స్తోంది. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను మరచి మభ్యపెడుతున్న తీరు కార్మికుల ను ఆగ్రహానికి గురి చేస్తోంది. కార్మి కుల సమస్యల పరిష్కారంలో యా జమాన్యం కూడా మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెల 27న ఆర్టీసీ సీఎండీని కలిసి 21 అంశాలపై ఆరు సంఘాల జేఏసీ తమ డిమాండ్లను అందిం చింది. వీటిపై ఎట్టకేలకు దిగివచ్చిన యాజమాన్యం ఈ నెల 10న కార్మిక శాఖ కమిషనర్‌ సమక్షంలో చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చ లు సఫలం కాకుంటే ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లేందుకు కార్మిక సంఘా లు సంసిద్ధమవుతున్నాయి.ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య లపై యాజమాన్యానికి ఎన్నో సార్లు విజ్ఞప్తులు, విన్నపాలు చేస్తూ వ చ్చారు. అనేక పెండింగ్‌ సమస్యల ను పరిష్కరించడంలో యాజమా న్యం అనుసరిస్తున్న మొండి వైఖ రిపై కార్మికులు విసిగిపోయారు. ఇటు అధికారంలోకి రాక ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలులోకి తేకపోవడంపైనా కార్మికులు రగిలి పోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు అందిస్తా మని, రెండు పీఆర్‌సీ బకాయిలు చెల్లిస్తామని, వచ్చే పీఆర్‌సీలో ఆర్టీసీ కార్మికులను చేరుస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా అన్ని వసతులు, సదుపా యాలు కల్పిస్తామని, ఆర్టీసీ బస్సు లను ఆధునీకరిస్తామని, అధునా తమైన సౌకర్యాలతో కొత్త సర్వీ సులు ప్రారంభిస్తామని, ఆర్టీసీ యూనియన్ల పునరుద్దరణకు అనుమతిస్తామని ఇంకా అనేక హామీలను కార్మికులకు ఇచ్చింది.

 

 

ఓట్ల కోసం ఇచ్చిన ఈ హామీల్లో అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో వాటి ఊసే ఎత్తడం లేదని కార్మికు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చి న హామీలను నెరవేర్చాలని కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు వెళ్లినపుడ ల్లా అవమానాలకు గురవుతు న్నా రు. మంత్రులు మొదలు, ముఖ్య మంత్రి వరకు తమ పట్ల ఎన్నికలకు ముందు ఒక తీరు.. ఇప్పుడు మరో తీరు ప్రవర్తిస్తున్నారని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మండిపడు తున్నారు. 14 నెలల వరకు సహ నం వహించిన కార్మికులు, సంఘా లు ఇటు యాజమాన్యంతో అటు ప్రభుత్వంతో అమీ.. తుమీ తేల్చు కోవాలనే నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగానే ఆర్టీసీ కార్మిక సంఘాలైన టీఎంయూ, ఎంప్లాయీ స్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌, బీకేయూ, బీడబ్ల్యూ కే, కార్మిక పరిషత్‌ జేఏసీగా ఏర్పడి గత నెల 27న ఆర్టీసీ సీఎండీ, ఇత ర ఉన్నతాధికారులను కలిసి 21 అంశాలతో తమ డిమాండ్లను అం దించాయి. వాటిని తక్షణమే పరి ష్కరించాలని, లేని పక్షంలో నిర వధిక సమ్మెకు దిగుతామని హెచ్చ రించాయి.కార్మికుల్లో కదలిక తమ డిమాండ్లపై ఈ నెల 9 వరకు స్పం దించాలని గత నెల 27న ఇచ్చిన సమ్మె నోటీసులో కార్మిక సంఘాల జేఏసీ పేర్కొన్నది. అయితే, సమ్మె ను విచ్ఛిన్నం చేసేందుకు యాజ మాన్యం కుట్రలు చేస్తోందని కార్మిక సంఘాల నాయకులు అంటున్నా రు. డిపోల ఎదుట గేట్‌ మీటింగ్‌లు పెట్టి కార్మికులు, ఉద్యోగులకు ఆర్టీ సీ యాజమాన్యం ఇప్పటి వరకు కల్పించిన సదుపాయాలను వివ రించే ప్రయత్నం చేస్తోంది. ఉద యం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు షిఫుల్లో విధులకు హాజ రయ్యే కార్మికులకు డిపోల మేనేజ ర్లు, ఇతర అధికారులు గేట్‌ మీటిం గ్‌లు తీసుకుంటూ యాజమాన్యా నికి నివేదికలు ఇస్తున్నారు. అధికా రులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసి నా తమ సంఘాలు తీసుకునే నిర్ణ యానికి కట్టుబడి ఉంటామని కార్మి కులు స్పష్టం చేస్తున్నారు. కాగా, మునుపెన్నడూ లేని విధంగా ఆర్టీసీ కార్మికుల్లో కదలిక కనిపిస్తోంది. స మ్మెకు ఎప్పుడు పిలుపునిస్తే అప్పు డు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మికులు ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు.తాము ఎదుర్కొంటు న్న సమస్యలను ఈ సందర్భంగా ఏకరవు పెడుతున్నారు. ము ఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మాస్టర్‌ స్కేల్‌ విధానం ఆర్టీసీకి కార్మకులకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పని భారంతో గుండె పోట్లకు గురై మరణిస్తుంటే యా జమాన్యం చెకింగ్‌ల పేరుతో తమ ని వేదిస్తోందని కండక్టర్లు, డ్రైవర్లు వాపోతున్నారు. ఆధునికత పేరు తో కార్పొరేట్‌ సంస్థలకు చెందిన ఎలక్ట్రికల్‌ బస్సులను అద్దెకు తెచ్చి ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసే కుట్రకు తెర తీశారని మండిపడుతున్నా రు. ఈ బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవ ర్లకు, ఆర్టీసీకి సంబంధం లేద ని, ఈ బస్సుల కోసం ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఎలక్ట్రికల్‌ బస్సు లను ఆర్టీసీ యాజమాన్యమే నడ పాలని, ప్రైవేట్‌ గుత్తాధిపత్యం ఎం దుకని ప్రశ్నిస్తున్నారు. ఈ బస్సుల ప్రవేశంతో తమకు ఉద్యోగ భద్రత కరువవుతోందని వాపోతున్నారు.
గత పదేళ్లలో ఆర్టీసీలో రిక్రూట్‌మెం ట్‌ లేక పోవడంతో ఉద్యోగులపై విపరీతమైన పని భారం పెరిగిం దని, సంస్థలో ఉద్యోగులు రిటైర్డ్‌ అయిన తర్వాత ఉన్నవారితోనే పనిచేయిస్తున్నారని, పనిభారం తట్టుకోలేక ఆర్టీసీ కార్మికులు అనా రోగ్యం బారిన పడుతున్నారని, దీనికి తోడు యాజమాన్యం వేధిం పులు రోజు రోజుకూ పెరుగుతు న్నాయని వాపోతున్నారు. 14 నుంచి 16 గంటలు డ్యూటీ చేయా ల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పదేళ్లుగా కార్మికులకు రా వాల్సిన ఎన్‌క్యాష్‌మెంట్‌ ఇంత వర కు చెల్లించలేదని, కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అవస్థలు పడుతున్నా యాజమాన్యం పట్టిం పు లేకుండా వ్యవహరిస్తోందనే ఆరో పణలు వస్తున్నాయి. 2024 నుంచి రిటైర్మెంట్‌ పొందిన ఉద్యో గులు, కార్మికులకు గ్రాట్యుటీ చెల్లిం చక పోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గడిచిన ఐదేళ్లు గా యూనిఫాం కూడా ఇవ్వడం లే దని కార్మికులు ఆవేదన చెందుతు న్నారు. ఇలా అనేక సమస్యలను సమ్మె నోటీసులో ప్రస్తావించిన జేఏసీ నాయకులు ఇప్పటికైనా త మ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.చర్చలు ఫలించకపోతే సమ్మె అనివార్యం

 

ఈ నెల 10న హైదరాబాద్‌లోని కా ర్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ కా ర్యాలయంలో ఆర్టీసీ యాజమా న్యం, జేఏసీ నాయకులతో చర్చిం చేందుకు శుక్రవారం నోటీసులు ఇ చ్చింది. 10న సాయంత్రం 4 గంట లకు జరగబోయే చర్చల్లో జేఏసీలో ని ఏడు సంఘాల నాయకులు హా జరవుతున్నారు. కార్మికులు సమ్మె కు వెళ్తే ఎదురయ్యే పరిణామాలపై ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యంలో చర్చ జరగుతున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం చేతిలో ఉన్న సమ స్యలను పరిష్కరించేందుకు ముం దుకు వస్తుందా, లేదా, కార్మిక సం ఘాలు ఇచ్చిన 21 డిమాండ్లలో ఎన్నింటికి అంగీకరిస్తుందనేది ఆస క్తిగా మారింది. కార్మిక సంఘాలు మాత్రం తామిచ్చిన 21 డిమాండ్ల లో అన్నింటినీ పరిష్కరించాలని గట్టి నిర్ణయానికి వచ్చినట్లు తెలు స్తోంది. ప్రభుత్వం తీసుకోవాల్సిన విధాన పరమైన నిర్ణయాలపైనా యాజమాన్యమే చర్చించాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్‌ చేస్తోంది.యాజమాన్యమే ప్రభు త్వంతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయాలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. అయి తే, యాజమాన్యం తమ డిమాండ్ల ను అంగీకరించకుంటే.. తదుపరి చేపట్టే కార్యక్రమాలపై కార్మిక సం ఘాలు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే సమ్మె పోస్టర్లను కూడా జేఏసీ ఆధ్వర్యంలో విడుదల చేశా రు. జేఏసీలో చేరిన కార్మిక సంఘా లు కూడా సన్నాహక సమావేశా లకు సిద్ధమవుతున్నాయి. అందు లో భాగంగా ఆర్టీసీలో అతిపెద్ద కార్మిక సంఘమైన తెలంగాణ మ జ్దూర్‌ యూనియన్‌ ఆదివారం హైద రాబాద్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారంరెడ్డి థామస్‌రెడ్డి ఆధ్వర్యం లో రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఇది స మ్మె సన్నాహక సమావేశమేనని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేస్తు న్నారు.చర్చల తర్వాతే నిర్ణయం
ఆర్టీసీ యాజమాన్యం ఎట్టకేలకు చర్చలు జరిపేందుకు దిగి వచ్చింది. కార్మిక శాఖ మధ్యవర్తిత్వం వహి స్తోంది. ఈ నెల 10న హైదరాబా ద్‌లోని టంగుటూరి అంజయ్య భవన్‌లో చర్చలకు సమయం ఇ చ్చారు. మేం పెట్టిన డిమాండ్లన్నిం టినీ పరిష్కరించాల్సిందే. సమ్మె చేయాలనేది మా ఉద్దేశం కాదని ముందే ప్రకటించాం. మాపై యాజ మాన్యం, ప్రభుత్వం అవలంభిస్తు న్న విధానాలు మారాలని కోరుతు న్నాం. మా న్యాయమైన డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలని అడు గుతున్నాం. ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా ఎలక్ట్రికల్‌ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకుంటోంది. ఆర్టీసీ ఆస్తులను ధారాదత్తం చేస్తోం ది. ఇవన్నీ ఆర్టీసీని ప్రైవేటీకరించేం దుకు జరుగుతున్న కుట్రలుగా మేం భావించాల్సి వస్తోంది. ఎలక్ట్రికల్‌ బస్సులను ఆర్టీసీయే సమకూర్చు కోవచ్చు కదా ఇందులో ప్రైవేట్‌ పెత్తనం ఏంటి వీటి వల్ల కార్మికుల భద్రతకు, ఆర్టీసీకి ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. మేం స్పష్టమైన ఎజెండాతో వెళ్తాం. అంతే కాకుం డా, ప్రభుత్వం తీసుకోవాల్సిన వి ధాన పరమైన నిర్ణయాల విషయం లోనూ యాజమాన్యమే చొరవ తీసుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలనేది కూడా మా డిమాండ్లలో ప్రధానమైనది. ఆర్టీసీ యాజమాన్యంతో జరిగే చర్చల రిజల్ట్‌ను బట్టి సమ్మె నిర్ణయం తీసు కుంటాం. జేఏసీలో మరో సంఘం చేరడంతో ఏడుకు చేరాయి. ఈ నెల 10న చర్చలు విఫలమైతే సమ్మె ఎప్పటి నుంచి అనేది ప్రకటిస్తాం.

 

టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి, ఆర్టీసీ జేఏసీ వైస్‌ చైర్మన్‌ మా రంరెడ్డి థామస్‌ రెడ్డి ఈ సంద ర్భం గా మాట్లాడుతూ కార్మికులను ప్ర లోభ పెడుతున్నరు, మా సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగుతా మని గత నెల 27న నోటీసు ఇచ్చి నప్పటి నుంచి ఆర్టీసీ యాజమా న్యం కార్మికులను ప్రలోభ పెడు తోంది. ప్రతి డిపో ఎదుట ఉద యం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు షిఫ్టుల్లో విధులకు హాజ రయ్యే కార్మికులకు గేట్‌ మీటింగ్‌లు పెట్టి అధికారులు మాయ మాటలు చెబుతున్నరు. సమ్మెకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని భయపెడుతున్నరు. అయినా, కార్మికులు వినే స్థితిలో లేరు. ఏండ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న సమ స్యలను పరిష్కరించుకునేందుకు సమ్మె ఒక్కటే మార్గమనే నిర్ణయా నికి వచ్చారు. ఆర్టీసీని కాపాడు కునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సమ్మె అనివార్యమైతే అన్ని రాజకీ య పక్షాల మద్దతు కోరుతున్నం. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ 90 శాతం పూర్త య్యింది. మిగతా 10 శాతం పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.