Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TPCC Kondeti Mallaiah : వర్గీకరణపై మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

TPCC Kondeti Mallaiah : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఎస్సీ వర్గీకరణ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇ చ్చిన మాట నిలబెట్టుకుందని టిపి సిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండే టి మల్లయ్య అన్నారు.ఎస్సీ వర్గీక రణ పోరాటంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాదిగ ఉద్యోగ సమాఖ్య (MEF)అధ్యక్షులుగా కొనసాగి, MRPS, MEF, ఉద్యమాన్ని ముం దుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్యను ఆదివారం నల్గొండలో ఆయన నివాసంలో MRPS సీనియర్ నాయకులు బోకే అందజేసి శాలు వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మే రకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభు త్వం ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసి, కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అసెంబ్లీలో బిల్లు ఆమో దించి కేంద్రానికి పంపించిందని అన్నారు.దీంతో ఎన్నో దశాబ్దాల మాదిగల కళ నెరవేరిందని పేర్కొన్నారు.

విద్య, ఉద్యోగాలలో మాదిగ, మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని, ఎవరి వాటా వారికి దక్కుతుందని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అండగా నిలిచిందని తెలిపారు. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా వర్గీకరణకు మద్దతు తెలిపాయని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకు మొట్టమొదట అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదరం రాజనర్సింహ, ఉత్తంకుమార్ రెడ్డిలకు, ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కొండేటి మల్లయ్యను సన్మానించిన వారిలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కత్తుల తులసిదాస్, మేడి చిన్న, తొలకొప్పుల గిరి,కత్తుల పూర్ణనందం,కత్తుల సైదులు, వట్టేపు అంజయ్య,కత్తుల రమేష్ పాల్గొన్నారు.