Traffic Rules : ప్రజా దీవెన, కోదాడ: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మున్సిపల్ పరిధిలోని స్థానిక బాలాజీ నగర్ లో గిరిజన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అంతర్రాష్ట్ర రవాణా చెక్ పోస్ట్ వారి ఆధ్వర్యంలో భద్రత నియమాలు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్ మాట్లాడుతూ రోడ్డుప్రమాదాలు ,నివారణ, రోడ్డు భద్రత పాటించవలసిన నియమాల పైన విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మద్యపానం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని ఇట్టి నేరాలకు మూడు నెలలు జైలు శిక్ష మరియు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం విద్యార్థులకు వ్యాసరచన ,ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ అవగాహన సదస్సులో ,మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్. రాజ మహమ్మద్, కే.శ్రీనివాస్, షేక్ జిలాని, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ,సంపత్ గౌడ్ , పాఠశాల నిర్వాహకులు నాగజ్యోతి, ఉపాధ్యాయులు, సిబ్బంది , కానిస్టేబుల్స్ , జానకిరామ్, ఉప్పయ్య, సిబ్బంది నాగేశ్వరరావు, కొండల్,కోటి,నాగరాజు, తదితరులు పాల్గొన్నారు