Traffic rules : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అం దుకోసం విధిగా వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నియమ నిబం ధనలు పాటించాలని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లావణ్య సూ చించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్స వాలలో భాగంగా శని వారం నల్లగొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ దూది రాజు ఆధ్వర్యం లో జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో నిర్వహించిన అవగాహాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతి ధిగా హాజరయ్యారు.
క్లాక్ టవర్ సెంటర్లో ర్యాలీ నిర్వహించి మాట్లా డారు. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీ సుకోకుండా నిర్లక్ష్యంగా, అజాగ్రత్త గా నడపడం వల్లనే అనేక ప్రమాదా లు చోటు చేసుకుంటున్నాయన్నా రు. అత్యధికంగా మద్యం సేవించి వాహనాలు నడపడంతో జరిగిన ప్రమాదాలలో ఎక్కువ మంది చని పోవడంతో పాటు క్షతగాత్రులయిన సందరా ఉన్నాయన్నారు. ప్రతి వాహనదారుడు అతి వేగంగా, మద్యం మత్తులో నడిపే సమయం లో ఇంటి దగ్గర మీకోసం మీ కు టుంబ ఎదురు చూస్తుందనే ఆలో చనతో జాగ్రతగా గమ్య స్థానాలకు చేరుకోవాలన్నారు.