Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Trainaccident : అందుకేనా రైలు కిందపడి ఆటోడ్రైవర్ ఆత్మహత్య

--గతంలో హిజ్రాను పెళ్లాడిన మృత యువకుడు --ఆ వివాదంలో ఆత్మహత్య చేసుకున్న హిజ్రా --అప్పట్లో సంచలనాలకు వేదికైన నిడమానూరు పోలీస్ స్టేషన్ --నేడు అదే కారణంతో యువకుని ఆత్మహత్య అని అనుమానాలు

 

Trainaccident:  ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేం ద్రంలో శుక్రవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. కేశరా జు పల్లి వద్ద ఉన్న ట్రాక్ వద్ద రై లు కిందపడి గోశెట్టి నిషాంత్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే పోలీసు లు, నల్లగొండ పోలీసులు సం యు క్తంగా కేసు దర్యాప్తు చేస్తున్న క్రమం లో గతంలో జరిగిన నల్లగొండ జిల్లా నిడమానూరు పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగిన సంచలన సంఘటన తెరమీదకొచ్చింది.

స్థానికులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరు మం డలం ముప్పారం గ్రామానికి చెందిన గో శెట్టి నిషాంత్ ఆటో నడుపుతూ జీవ నం సాగిస్తున్నాడు. గత కొ న్నేండ్ల క్రితం హైదరా బాద్ లోని మీర్ పేటలో ఓ హిజ్రాతో పరిచయం ఏర్పడి ఆ తర్వాత వివాహం కూడా చేసుకున్నాడు. అనంతరం ఇరువురు స్వగ్రామానికి రాగా, రమేష్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ తతంగం మొత్తం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సంఘటనగా నిలిచింది.

ఈ నేపధ్యంలో రమేష్, ఆ హిజ్రాకు మధ్య ఘర్షణ ఏర్పడి మీర్ పేటకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. అదే సమయంలోహైదరాబాద్ నుంచి భా రీ సంఖ్యలో హిజ్రాలు తరలి రావడంతో వివాదం కాస్తా చిలికి చిలికి గాలి వానల మారిoది. దాదా పు వంద మంది హిజ్రా లు, డెడ్ బా డీని తీసుకొచ్చి నిడమనూరు పో లీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేయ డంతో నిడమనూరులో ఉద్రిక్త వాతావరణం నెల కొంది. అయితే ఈ మధ్యనే కేసు ఫైనల్ కు వచ్చి కొట్టేశారని బంధు వులు పేర్కొంటున్నారు.

వారం రోజుల క్రితమే.. వారం రోజుల క్రితమే ఇంట్లో ఎవరికీ చెప్ప కుండా వెళ్లాడు. గురువారం సాయంత్రం తల్లిదండ్రులు నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఆటోతో సహా హైదరాబాద్ వెళ్లి ఉం టాడని అనుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తెల్లారే ఇలా జరగ డమేంటని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఘటనలు అ న్ని సద్దు మనిగిన తర్వాత నిషాంత్ రెం డేండ్ల క్రితం మేన మర్దలిని వివాహం చేసుకున్నాడు.

వారికి ఏడాది వయసున్న బాబు ఉన్నా డు. నిషాంత్ చావుకు కు టుంబ కలాహాలే కారణమై ఉంటాయా గ తంలో తన వల్ల ప్రాణాలు కోల్పో యిన హిజ్రా కుటుంబీకులతో ఏమై నా ఘర్షణ జరిగిందా, రై లు పట్టాల పైకి ఒక్కడే వెళ్లాడా, మద్యంమత్తు లోనే మనస్తాపంతో అఘాయిత్యం చేసుకున్నాడా తదితర కారణాల కోణంలో పోలీసు లు సీసీ ఫుటేజ్ ద్వారా వివరాలు సేకరిస్తూ విచారణ చేస్తున్నట్లుగా వెల్లడవుతోంది.