Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tripathi : గ్రామ సభల్లో చదివే జాబితాలు ఖరారైనవి కావు

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Tripathi : ప్రజా దీవెన, చిట్యాల: రేషన్ కార్డు లు, ఇందిరమ్మ ఇండ్లు,రైతు భరో సా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం గ్రామ సభలలో చదువుతు న్న జాబితాలు ఖరారైన జాబితాలు కావని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యా ప్తంగా ఇప్పటివరకు ఏ ఒక్క రేషన్ కార్డు మంజూరు కాలేదని, గ్రామస భలలో కేవలం ఆయా పథకాల కింద వచ్చిన దరఖాస్తుల పేర్లను మాత్రమే చదవడం జరుగుతున్నద ని, అవి ఏ పథకం కింద ఖరారైన జాబితాలు కాదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.ప్రజా పాలన గ్రామసభలలో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా ,చిట్యాల మున్సిపాలిటీ పరి ధిలోని 5వ వార్డులో నిర్వహించిన వార్డు సభకు హాజరై వార్డు సభ ప్రక్రియను పరిశీలించారు.

 

ఆయా పథకాల కింద తుది జాబితాలు, ఖరారైన జాబితాలను గ్రామసభలు, వార్డు సభలలో అధికారులు చదువుతున్నారని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని, వీటిని నమ్మవద్దని కలెక్టర్ తెలిపారు. రేషన్ కార్డు లు,ఇండ్లు తదితర పథకాల కోసం గతంలో మీ-సేవ ,ప్రజా పాలన, కుల గణన సందర్భంగా, అలాగే ప్రస్తుతం గ్రామ సభలలో దరఖా స్తులను స్వీకరించడం జరుగుతు న్నదని, వీటన్నింటిని పరిశీలనలోకి తీసుకుని పూర్తిగా పరిశీలించి అర్హు లైన వారికి మాత్రమే ఆయా పథ కాలను అమలు చేయడం జరుగు తుందని స్పష్టం చేశారు. ఒకవేళ గ్రామ సభలో ఎవరైనా దరఖాస్తు సమర్పించలేక పోతే, లేదా గ్రామ సభల్లో చదివే జాబితాలలో పేర్లు లేని వారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని, గ్రామసభలలో దరఖాస్తు చేయలేకపోయిన వారు ప్రజా పాలన సేవ కేంద్రాలలో ఉద యం 9 గంటల నుండి 5 గంటలలో పు దరఖాస్తు సమర్పించవచ్చని చెప్పారు.

 

 

ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆర్ సి సి రెంటు ఇండ్లలో ఉండి దరఖాస్తు చేసుకున్నవారు వారికి ఎక్కడైతే స్థలం ఉంటుందో అక్కడ ఇల్లు నిర్మించుకునేందుకు అవకా శం ఇవ్వడం జరుగుతుందని, అలాంటి వాటిని బుధవారం లోపు బదలాయించాలని చిట్యాల మున్సిపల్ కమిషనర్ వీరేందర్ ను ఆదేశించారు. ఈ విషయాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీ వోలు, ప్రత్యేక అధికారులు దృష్టి పెట్టాలని చెప్పారు .ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా కార్యక్రమా లకు పారదర్శకంగా గ్రామసభలను నిర్వహించడం జరుగుతున్నదని, అందువల్ల ప్రజలు అపోహలు నమ్మకుండా పూర్తిగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

 

 

నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు గడచిన పది సంవత్సరాలు నుండి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారని, ఇం డ్లు లేక ఎంతో బాధ పడుతున్నా రని అన్నారు. రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యాన్ని ఇవ్వాలనే ఆలో చనతో ప్రభుత్వం ఉందని, అలాగే నిజమైన, అర్హుడైన పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. ఈ రెండు పథకాలతో పాటు, రైతుబంధు కింద రైతుకు సహాయం చేసేందుకు ,వ్యవసాయ కూలీలకు ఒక్కో విడత 6000 చొప్పున 12 వేల రూపాయలు ఇచ్చేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో చిట్యాలలో 246 ఇండ్లను చేపట్టడం జరిగిందని, అవి దాదా పు పూర్తయ్యే దశలో ఉన్నాయని, వాటిని అన్ని వర్గాలతో కలిసి ఆలోచించి ఎంపిక చేసి నిజమైన, అర్హత ఉన్న లబ్ధిదారుడికి అందజే సేలా చూద్దామని చెప్పారు.

 

సొంత జాగా ఉన్నవారికి సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునేందుకు అవకా శం కల్పించడం జరుగుతుంద న్నారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు రాగా, మరో 700 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నాయని, వీటితో పాటు మరికొ న్ని మంత్రుల సహకారంతో తీసు కొచ్చి మొత్తం 5 వేల ఇండ్లను నియోజకవర్గంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇల్లు నిర్మించుకునేం దుకు జాగా లేని వారికి ప్రస్తుతం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పక్కన స్థలం ఉందని, అక్కడ ఇండ్లు నిర్మించుకునే విషయంలో మంత్రులతో పాటు, జిల్లా కలెక్టర్ సహకరించాలని కోరారు.చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ జెడి శ్రవణ్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, తదితరులు ఈ వార్డ్ సభకు హాజరయ్యారు.