Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tripathi : ఓట్ల లెక్కింపుకు ప్రతిపాదనలు పంపించేందుకు సిద్ధం

Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎ మ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకై ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్ హౌసిం గ్ గోదాము లో ఓట్ల లెక్కింపు చేప ట్టేందుకు ప్రతిపాదనలు పంపిం చేందుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధి కారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, వ్యవసాయ అధికారి శ్రవణ్ తదితరులతో కలిసి ప్రభు త్వ ఆసుపత్రిలోని సమావేశ మం దిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ ను పరిశీ లించా రు.

 

 

 

శనివారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్, ఇతర సంబంధించిన అధికారులతో కలిసి అర్జల భావి వద్ద ఉన్న వేర్ హౌసింగ్ గోదాము ను పరిశీలించారు. కాగా ఎన్నికల సంఘం వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 28 న ఈ ఎన్నికల పోలింగ్ జరగనుం డగా, మార్చి 3 న ఓట్ల లెక్కింపు జరగ నుంది.

 

ఇందులో భాగంగా ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపటెందుకుగాను ఆర్జాల బావి వద్ద ఉన్న వేర్ హోసింగ్ గోదామును ప్రతిపా దించేందుకు ఆమె పరిశీలించి ప్రతిపాదనలు సమ ర్పించాలని చెప్పారు. ఈ సంద ర్భంగా గోదాంలో ఓట్ల లెక్కిం పుకు అవసరమైన ఏర్పాట్లు, అందుబా టులో ఉన్న స్థలం, తదితరాలన్నిం టిని జిల్లా ఎస్పీ అధికారులతో భేరీజు వేసుకున్న అనంతరం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ డి శ్రీనివాస్, ఆర్డిఓ వై అశోక్ రెడ్డి, నల్గొండ తహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.