Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tripathi : విద్యార్థులు విద్యతో ఉన్నత స్థానంలో నిలవాలి

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Tripathi :ప్రజా దీవెన, కనగల్: విద్యార్థులు బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థానంలో నిలవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు . మంగళవారం నల్గొండ జిల్లా, కనగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జడ్పీహెచ్ఎస్ లో చేపట్టిన భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లను ఆమె తనిఖీ చేసిన అనంతరం తొమ్మిదవ తరగతి, పదవ తరగతి విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు.

 

 

విద్యార్థులు బాగా చదువుకొని సమాజంలో ఉన్నత స్థానంలో నిలవాలని ఆమె అన్నారు .జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని నూతన భవనం నిర్మాణంతోపాటు, కేజీబీవీ పాఠశాల నూతన భవనాన్ని సైతం పూర్తి చేయాలని, త్వరలోనే టెండర్లు పిలవడం జరుగుతుందని ఆమె తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఇటీవల వైద్య ఆరోగ్య కేంద్రానికి పంపించిన సామాగ్రిని అడిగి తెలుసుకున్నారు.తహసిల్దార్ పద్మ తదితరులు ఉన్నారు.