Tripathi : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరులైన వారి స్పృత్యర్థం 2 నిమిషాలు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతిలాల్, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమరులకు అంజలి ఘటించి మౌనం పాటించారు.