–హరీశ్ విమర్శల పర్యవసానంతో మనస్తాపం
–ప్రజల కోసం పని చేసే మనిషిని పబ్లిసిటీ కోసం కాదు
–ప్రజాస్వామ్యంలో నీది నాది ఏదీ లేదు, అంతా ప్రజలదే
–మీ తప్పిదాలను మాకు అంటగ ట్టొ ప్రయత్నం
— బీఆర్ఎస్ హయాంలో 39 శాతం పనులే పూర్తయ్యాయి
–రేపు సీఎం చేతుల మీదుగా మూడు పంప్హౌస్లు ప్రారంభం
–ఖమ్మంతో పెట్టుకోవద్దు ఎంత త క్కువ గోక్కుంటే అంత మంచిదన్న పొంగులేటి
Tummala Nageswara Rao : ప్రజా దీవెన, ఖమ్మం: రాష్ట్ర వ్యవ సాయశాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు (Tummala Nageswara Rao) మనస్థాపంతో కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టుకు ఇప్పుడు రిబ్బన్ కట్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నా రంటూ మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తుమ్మల మనస్తాపానికి గురయ్యారు. ప్రజాస్వామ్యంలో నీది నాది అంటూ ఏదీ ఉండదని, అంతా ప్రజల కష్టం, రక్తం, చెమటతో కట్టే పన్నులతోనే పనులు చేస్తాం తప్ప సొంత డబ్బుతో ఎవరూ పనిచేయ రని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించే బా ధ్యత అధికారంలో ఉండే ప్రభుత్వా నికే ఉంటుందనే విషయం గుర్తుం చుకోవాలన్నారు. ఇది తెలుసుకో కుండా హరీశ్రావు (Harish Rao)తనపై విమర్శ లు చేయడం తగదన్నారు.
మంగళ వారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో (camp office) మంత్రి తుమ్మల(Tummala Nageswara Rao) విలేకరులసమావేశంలో మాట్లా డారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవి తంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే మంత్రిగా ఉన్నానే తప్ప పబ్లిసిటీ కోసం పనిచేసేవాడిని కాదు. చీప్ పబ్లిసిటీలు నాకు అవ సరం లేదని, ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించడమే నా లక్ష్య మన్నారు. ఈ నెల 15న జరిగే సీతా రామ ఎత్తిపోతల స్విచ్చాన్ కార్యక్ర మానికి బీఆర్ఎస్ వాళ్లు కూడా రావ చ్చునని సూచించారు. వైరా సభలో మీ ప్రభుత్వంలో మీరు సీతా రామ ప్రాజెక్టును ఎలా వదిలేశారో చెప్పుకొనేందుకు అవకాశం కల్పి స్తామని తుమ్మల వ్యాఖ్యానిం చారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజా సమస్యల పరి ష్కారం కోసం పనిచేసే మంత్రిగా ఉన్నానే తప్ప పబ్లిసిటీ కోసం పని చేసేవాడిని కాదని, చీప్ పబ్లిసిటీలు నాకు అవసరం లేదని, ప్రజల సమ స్యలు సత్వరం పరిష్కరించడమే నా లక్ష్యనని అన్నారు. ఈ నెల 15 న జరిగే సీతారామ ఎత్తిపోతల స్విచ్చాన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వాళ్లు కూడా రావచ్చునని సూచిం చారు. ‘‘వైరా సభలో మీ ప్రభు త్వంలో మీరు సీతారామ ప్రాజెక్టు ను ఎలా వదిలేశారో చెప్పుకొ నేందుకు అవకాశం కల్పిస్తామని తుమ్మల(Tummala Nageswara Rao) వ్యాఖ్యానించారు.
8 వేల కోట్లు ఖర్చుపెట్టి అసం పూర్తిగా వదిలేశారు.. గత ప్రభు త్వం సీతారామ ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎక రానికి కూడా నీళ్లివ్వకుండా అసం పూర్తిగా వదిలేసిందని మంత్రి తుమ్మల చెప్పారు. కనీసం ఉన్న వనరులతోనైనా సాధ్యమైనంత వరకు నీరందించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకె ళ్లానని తెలిపారు. ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించి వైరా, లంకసాగర్ పరిధిలో లక్షా 25 వేల ఎకరాలకు ఈ ఏడాది నీరివ్వవచ్చ ని ఒప్పించానన్నారు. ముఖ్యమంత్రి రూ.90 కోట్లు మంజూరు చేయడం తో రెండు నెలల్లో పనులు పూర్తిచే యించి, కాలువలు తవ్వించి నీళ్లు వదలబోతున్నామని చెప్పారు. ‘‘గత ప్రభుత్వ హ యాంలో మొదటి ఐదేళ్లలో సీతారామ ప్రాజెక్టు (Sitarama project)పను లు చేపట్టి అక్కడక్కడా కాలవలు తవ్వి మూడు పంపుహౌజ్లకు మోటార్లు పెట్టి వదిలేశారు. ఆ తర్వాత ఐదేళ్లలో ఈ పనులను పట్టించుకోకుండా డిజైన్ మార్చి అస్తవ్యస్తం చేశారు. అయినా రూ.8 వేల కోట్లు ఖర్చుపెట్టారు. ప్రజల సొమ్ము వృధా కాకూడదనే మేం సత్వరం ఎత్తిపోతలు పూర్తి చే యాలని భావించాం. ట్రయల్రన్ నిర్వహించకపోతే మోటార్లు పని చేయవనే ఉద్దేశంతో వాటిని విని యోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుంటే తప్పుడు విమర్శలు చేయడం హరీశ్రావుకు తగదు’’ అని తుమ్మల అన్నారు.
మొదటి పంపుహౌజ్కు తాను స్విచాన్ చేయలేదని, నీటిపారుదల శాఖ (Irrigation Department) నిపుణుడు పెంటారెడ్డితో చేయిం చానని మంత్రి తుమ్మల తెలిపారు. ఒక మనిషిలా గోదావరి జలాలను తలపై చల్లుకున్నానని చెప్పారు. తన రాజకీయ జీవిత లక్ష్యం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు గోదావరి జలాలను అందించడమే నని, అంతేతప్ప ఫ్లెక్సీల కోసం, ప్రక టనల కోసం, స్వార్ధం కోసం ఏనా డూ ఏ పనీ చేయలేదన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువకాలం మంత్రిగా పనిచేసే అవకాశం తనకు లభిం చిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం తోపాటు తెలంగాణ రాష్ట్రంలోనూ మంత్రిగా అప్పటి ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, ఎన్టీఆర్, వైఎ స్ఆర్, చంద్రబాబు (Jalagam Vengalarao, NTR, YA SR, Chandrababu) చేసిన అభివృద్ధి పనులు ఎక్కడైనా మిగిలిపోతే వాటిని పూర్తిచేశానే తప్ప గత ప్రభు త్వాలు చేశాయని వివక్ష చూపించ లేదన్నారు. ప్రజాభిమానం ఉంటేనే గద్దెపై ఉంటామన్న విషయం గుర్తుం చుకోవాలని, బీఆర్ఎస్ నేతల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధ ఇంకా కనిపిస్తోందని అన్నారు. వారి పాలనలో తప్పిదాలను తమ ప్రభు త్వానికి అంటగట్టవద్దన్నారు. గతం లో ఇష్టానుసారంగా గురుకులాలు పెట్టి సమస్యలు గాలికి వదిలే శారని, ఈ ఆరు నెలల్లోనే తమ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ట్టుగా విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.