Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tummala Padma : మల్లు స్వరాజ్యం ఆశయాలను కొనసాగిస్తాం

–ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ

Tummala Padma : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శమని వారి ఆశయాలు కొనసాగిస్తామని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ అన్నారు.బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని విద్యానగర్ పార్కులో మల్లు స్వరాజ్యం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ ఆనాడు దున్నేవాడికే భూమి కావాలని పెట్టి చాకిరి విముక్తి కావాలని మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల వ్యతిరేకంగా నిలబడి తుపాకీ పట్టి పోరాడిన మల్లు స్వరాజ్యం జీవితం నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని అన్నారు.

భూమి భుక్తి విముక్తి పోరాటాలు ద్వారానే నిజాం నిరంకుశ జాగీర్ దేశముకుల పాలన అంతమైందని అన్నారు. మల్లు స్వరాజ్యం తన పదకొండవ ఏట నుండి ప్రజా ఉద్యమాలలో పాల్గొని తుంగతుర్తి కి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన జీవితాంతం ప్రజల కోసం పోరాడిందని గుర్తు చేశారు. నేటి పాలకులు మద్యం, మత్తు పదార్థాలు నియంత్రించడంలో ఘోరంగా విఫలం చెందుతున్నారని ప్రజలు విద్యా, వైద్యం ఉపాధి కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు బి. ఇందిరా, పి. పద్మావతి, గోవిందమ్మ, ఎం. ప్రశాంతి, యాదమ్మ, నవీన, రజిత, రేణుక, పద్మ, రజిని, తులసి, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.