Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TUWJ : మానవత్వం చాటుకున్న టీయూ డబ్ల్యూజె (టీజేఎఫ్) బృందం

TUWJ : ప్రజా దీవెన ఖమ్మం: అనారోగ్య కారణాల వల్ల కిడ్నీల సమస్యతో బాధపడుతున్న జర్నలిస్టుకు టీ యూడబ్ల్యూజె (టీజే ఎఫ్) యూని యన్ రూ.20 వేల ఆర్థిక సహా యం అందించి అండగా నిలిచింది.
గత కొన్ని రోజులుగా కిడ్నీల వ్యాధి సమస్యతో బాధ పడుతున్న ఖమ్మం నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పేరబోయిన తిరుపతి రావు కు టీయూ డబ్ల్యూజె (టీజే ఎఫ్)యూనియన్ అండగా నిలిచి మానవత్వం చాటుకుంది. జర్న లిస్టు అనారోగ్య పరిస్థితిని తెలు సుకున్న టీయూడబ్ల్యూజె (టీ జేఎఫ్) బృందం శుక్రవారం ఖమ్మం నగరంలోని ప్రశాంతి నగర్ లో నివ సిస్తున్న తిరుపతి రావు స్వగృహా నికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు.
వైద్య ఖర్చుల నిమిత్తం జర్నలిస్టు కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వా న్ని చాటుకున్నారు.

ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్య వచ్చిన యూని యన్ దృష్టికి తీసుకురావాలని, తక్ష ణమే పరిష్కరించి అండగా నిలు స్తామని జర్నలిస్టు కుటుంబానికి భరోసా కల్పించారు. అంతే కాకుం డా తిరుపతి రావుకు వైద్యం అం దిస్తున్న డాక్టర్ ను ఫోన్ ద్వారా సం ప్రదించి మెరుగైన వైద్యం అందిం చాలని విజ్ఞప్తి చేశారు. పరామ ర్శించిన వారిలోటీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి, జాతీయ కౌన్సిల్ సభ్యు లు వెన్నెబోయిన సాంబశివరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, ప్ర శాంత్ రెడ్డి, టిఎస్ చక్రవర్తి, టీడ బ్ల్యూజేఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు వనం నాగయ్య, జిల్లా నాయకులు ఉదయ్, మందుల ఉపేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాం బాబు, కోశాధికారి బిక్కి గోపి, ఎల క్ట్రానిక్ మీడియా నగర అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగ దీష్, కరీషా అశోక్, ఆర్ టివి శేఖర్, మహిళా ప్రతినిధి వంగూరి ఈ శ్వరి, వెంకటకృష్ణ, ఆంథోటీ శ్రీని వాస్,హరీష్, పాశం వెంకటేశ్వర్లు, పొన్నెబోయిన పానకాలరావు, బాబు, వెంకటేశ్వర రెడ్డి, ఇస్సంపల్లి వెంకటేశ్వర్లు, అప్పారావు, పి సి డ బ్ల్యూ నరేష్, అక్షర విక్షణం రమేష్, ప్రజా వాక్యం వెంకటేశ్వ ర్లు, తది త రులు పాల్గొన్నారు.

ఫోన్ లో పరామర్శించిన అల్లం నారాయణ…. జర్నలిస్టు తిరుప తి రావు అనారోగ్య పరిస్థితిని జిల్లా నాయకత్వం,రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగానే తక్షణమే స్పందించిన రాష్ట్ర మాజీ ప్రెస్ అకా డెమీ చైర్మన్, టీయూ డబ్ల్యూజె (టీ జేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నా రాయణ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ లు శుక్రవారం తిరు పతి రావు కు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు.ధైర్యంగా ఉండా లని జర్నలిస్టుకు సూచించారు.
ఆరోగ్య సమస్య తీవ్రతరమైన, హాస్పిటల్ వైద్యం విషయం లో ఎలాంటి సహాయసహకారాలు కావాలన్న జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.