Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TV9 Rajinikanth: టీవీ9 రజినీకాంత్ కు నోటీసులు

–ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు నోటీసులు
–దేశంలోనే అత్యంత ధనిక జర్నలి స్టుగా రజనీకాంత్ రికార్డు
–రజనీకాంత్ కార్యకలాపాలపై కన్నేసిన ఐటీ శాఖ అధికారులు

TV9 Rajinikanth: ప్రజా దీవెన, అమరావతి: ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ టీవీ 9 ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న రజనీ కాంత్ (TV9 Rajinikanth)కు ఐటి శాఖ షాక్ ఇచ్చింది. ఛానల్ కు ఉన్న ప్రచుర్యాన్ని వాడేసుకుని అడ్డగోలుగా అక్రమా ర్జన చేశారని ఆరోపణల నేపథ్యం లో ఐటీ శాఖ (IT Department) తాజాగా నోటీసులు అందజేసింది. తెలంగాణలో కేటీఆర్ నుంచి ఇటు ఏపీలో జగన్ నుంచి అడ్డంగా దోచుకున్న రజినీ కాంత్ కు ఐటీ శాఖ (TV9 Rajinikanth) నోటీసులు పం పింది. కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్టుగా రికార్డు ల్లోకి ఎక్కిన రజినీకాంత్ ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు నోటీసులు పంపారు. ఇటీవల ఢిల్లీలో ఉన్న కూతుర్ని కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్ బుక్ (Special Flight Book)చేసుకుని వెళ్లిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు ఇన్ కమ్ ట్యాక్స్ కు పంపారు గుర్తు తెలీని వ్యక్తులు వైసీపీ ముఖ్యనేత బంధువుకు చెందిన ఎయిర్ లైన్స్ (Air lines) సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైట్ తన వ్యా పార భాగస్వామి నాయుడు అనే వ్యక్తి ద్వారా బుక్ చేసినట్టుగా అం దుకు సంబంధించిన ఆధారాలు ఇన్ కమ్ ట్యాక్స్ అధికా రులకు దొరికాయి.

ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయడం అనేది ఇన్ కమ్ ట్యాక్స్ అధికారు లను ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ఇటీవలే ఫైనా న్సియల్ డిస్ట్రిక్ట్ లో రూ. 11కోట్లతో కొనుగో లు చేసిన అత్యంత ఖరీదైన ఫ్లాట్, మోకిలాలో రూ. 8కోట్లతో కొన్న విల్లా, మియాపూర్ లో కొన్న త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వీటన్నింటిపై నా ఆరా తీస్తున్నారు ఇన్ కమ్ ట్యాక్స్ (Income Tax)అధికారులు. వీటితో పాటు బెంగళూరులో రజినీకాంత్ కు సంబంధించిన ప్రీమియర్ రియల్ ఎస్టేట్ (Premier Real Estate) కంపెనీపైనా ఇటీవలే ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి. నెల్లూరు చెందిన కిషోర్ అనే వ్యక్తి తో కలిసి గత ఎనిమిదేళ్లుగా ప్రీమియర్ ఇన్ ఫ్రా కంపెనీని రజనీకాంత్ నడుపుతున్నాడు. ఈ సంస్థ బెంగ ళూరు శివార్లలో అనేక వెంచర్లు వేయగా కంపెనీలో ఎక్కడా తన పేరు రాకుండా బినామీలతో నడు పుతున్నట్లు వెల్లడైంది. అటు అమ రావతిలో చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో రజినీకాంత్ భూముల రేట్లు అమాంతం పెరిగాయి. గతం లో అమరావతిలోని కృష్ణాయ పా లెంలో కొనుగోలు చేసిన 18ఎకరాల భూమికి సంబంధించి సీఆర్డీయే నుంచి తిరిగి రావాల్సిన ఫ్లాట్లకు ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడ అసలు విషయం బయటకు పొక్కింది. సీఆర్డీయే (CRDA)నుంచి సమా చారం ఇన్ కమ్ ట్యాక్స్ అధికారు లకు చేరినట్టుగా తెలుస్తోంది. హైద రాబాద్ రోడ్ నంబర్ 36లో నడుస్తు న్న పబ్బులోనూ రజినీకాంత్ కు (TV9 Rajinikanth) వా టా ఉండగా జగన్ (jagan)ప్రభుత్వం దిగిపో యేముందు ఏపీ మంత్రితో కలిసి వైజాగ్ లో మరో పబ్బు స్టార్ట్ చేశా డు.అటు వైసీపీ ప్రభుత్వం నుంచి అందిన కోట్లాదిరూపాయలను క్యా ష్ రూపంలోనే తీసుకుని ఆ డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపా రంలో పెట్టాడు రజినీకాంత్. మరో వైపు వైసీపీ డిజిటల్ మీడియా (YCP Digital Media) ఇన్ చార్జ్ సజ్జలభార్గవ్ రెడ్డితో (Sajjalabhargav Reddy) కలిసి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్ ఫాంలను వైసీ పీకి అనుకూలంగా పని చేసేలా కాంటాక్ట్ కుదుర్చింది రజినీకాంత్ కావడం విశేషం. అయితే ఆ డిజిటల్ ఛానెల్స్, పత్రికలన్నింటికీ పేమెం ట్ ఇంకా పెండింగ్ ఉంది. పార్టీ ఓడి పోయింది కాబట్టి పెండింగ్ ఎమౌంట్ ఏదీ ఇప్పించలేనంటూ రజనీకాంత్ చేతులెత్తేయడంతో అటు సజ్జల భార్గవ్ రెడ్డి అటు ఐప్యాక్ సిబ్బం దికి,సోషల్ మీడియా సిబ్బందికి ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం ఆపేశాడు.

రజినీకాంత్, సజ్జల భార్గవ్ రెడ్డి కలిసి తమకు ఇవ్వా ల్సిన డబ్బులన్నీ కాజేశారని డిజిటల్ ఛానెల్స్ (Digital channels) వాళ్లు ఆరోపిస్తున్నా రు.మరోవైపు అటు తెలంగాణ ఎన్ని కల్లో ఇటు ఏపీ ఎన్నికల్లో పొలి టికల్ లీడర్ల ఇంటర్ వ్యూల పేరుతో భారీ మొత్తంలో వసూలు చేశాడు రజినీకాంత్ (rajinikanth).ఒక్కో లీడర్ నుంచి పదిలక్షల నుంచి పాతికలక్షల వర కూ మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో కోట్లాదిరూపాయలు వసూలు చేశా డు.వాస్తవానికి ఛానెల్ మార్కెటింగ్ టీమ్ తరఫున రావాల్సిన యాడ్ రెవెన్యూ అంతా ఇలా తానే లీడర్ల తో డైరెక్టుగా మాట్లాడి మొత్తం నొక్కేశాడు. ఇందుకు తన బినామీ అయిన ధర్మారెడ్డి అనే వ్యక్తి చేతుల మీదుగా జరిగాయని, ధర్నారెడ్డి, రజినీకాంత్ ఇద్దరూ కలిసి కాజేసిన మొత్తం మీద అటు మైహోమ్ (myhome) యాజమాన్యం కూడా విచారణ జరుపు తోంది. కంపెనీకి యాడ్ రెవెన్యూ ఎందుకు రాలేదని మార్కెటింగ్ హెడ్ విచారణ జరిపితే ఈ వ్యవహా రం మొత్తం బయటపడడంతో ఈ విషయాన్ని మేనేజ్మెంట్ కు చెప్పం డో రజినీ మెడకు చుట్టుకుందని సమాచారం. మొత్తం మీద ఒక్క పార్టీ అధికారంలో కోల్పోవడంతో రజినీకాంత్ కు కష్టాలు చుట్టుము ట్టాయని జోరుగా ప్రచారం జరుగుతుంది.