Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ ను కలిసిన సిపిఎం నేతలు

Uttam Kumar Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: శ్రీశైలం సొరంగమార్గానికి నిధులు కేటాయించాలని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో అంతర్భాగ మైన దిండి ఎత్తిపోతల పథకం డి పి ఆర్ ను ఆమోదించాలని కోరుతూ సిపిఎం బృందం (CPM team)బుదవారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)ని కలిసింది. మూసి కుడి ఎడమ కాలువల రిపేరు, ఆధు నికరించి పర్యాటక కేంద్రంగా అభి వృద్ధి చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి (minster)కి వినతి పత్రం అంద జేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యు లు జూలకంటి రంగారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నారి ఐలయ్య, పాలడుగు నాగా ర్జున తదితరులు ఉన్నారు.