Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: అభివృద్ధి పథంలో కోదాడ మునిసిపాలిటీ

Uttam Kumar Reddy: ప్రజా దీవెన ,కోదాడ: కోదాడ పురపాలక సంఘాన్ని అభివృద్ధిలో జిల్లాలోనే ముందు వరుసలోఏ నిలబడేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy అన్నారు గురువారం కోదాడ మున్సిపల్ కౌన్సిల్ (Kodada Municipal Council) వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొనిఏ మాట్లాడారు కోదాడ పట్టణంలో 19.60 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలుఏ నిర్వహించామని ఈ అభివృద్ధి పనులలో సంబంధిత శాఖలు అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు కోదాడ పురపాలక సంఘంలో (Kodada Municipal Corporation)పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కోదాడ మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు ఉన్న స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

కోదాడ పట్టణంలో జాతీయ రహదారిపై (National Highway)ఉన్న విద్య వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఇద్దరం కలిసి కృషి చేస్తామని అన్నారు అలాగే కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల మాట్లాడుతూ కోదాడ మున్సిపల్ అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని ప్రస్తుతం మున్సిపాలిటీలో నిధులు లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కనీసం కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఉందని ఏదైనా ఇతర నిధులనుండి 10 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని మంత్రిని ఆమె కోరారు కోదాడ పట్టణ అభివృద్ధిలో పాలకవర్గం అధికారులు భాగస్వాములు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంధాలాల్ పవర్ ఆర్డీవో సూర్యనారాయణ (RDO Suryanarayana)తాసిల్దార్ సాయి గౌడ్ కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరావు వివిధ శాఖల అధికారులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు