37.60 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్
కోదాడ, హుజూర్ నగర్ లకు రూ.40 కోట్లు మంజూరు
హుజుర్ నగర్ నియోజకవర్గానికి రూ.25 కోట్లు
కోదాడ గ్రామీణ రహదారులకు రూ.15 కోట్లు
Uttam Kumar Reddy: ప్రజాదీవెన, హైదరాబాద్: హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గల పరిధిలోని గ్రామాలలో అంతర్గత రహదారులకు మహర్దశ పట్టింది. దశాబ్దకాలంగా కనీసం మరమ్మతులకు కుడా నోచుకోని ప్రాంతాల్లో కొత్తగా రోడ్డు నిర్మాణాలకు (Road constructions)రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)నిర్ణయించారు. ఆ రెండు నియోజకవర్గాలలో జరుగుతున్న అభివృద్ధి పై మరోసారి మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. ఏకంగా రూ.40 కోట్ల నిధులను మంజూరు చేయిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి చేపట్టిన నూతన రహదారుల నిర్మాణంలో బాగంగా జీ. ఓ.నెంబర్ 593(11/10/2024) విడుదలైన ఉత్తర్వులలో ఆ రెండు నియోజకవర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంతాలలో 37.60 కిలోమీటర్ల నూతన రహదారుల నిర్మాణాలు చేపట్టనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్నగర్ నియోజకవర్గానికి రూ.25 కోట్ల నిధులు మంజూరు కాగా ఉత్తమ్ పద్మావతీ ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గానికి రూ.15 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని (Under Huzurnagar Constituency) గ్రామీణ ప్రాంతాలలో 23.90 కిలోమీటర్లు మేర అంతర్గత రహదారులు నిర్మించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని గడ్డిపల్లి బరెల్ గ్రౌండ్ నుండి బొలిశెట్టి గూడెం మీదుగా కొనాయిగూడెం వరకు 7 కిలోమీటర్ల దూరం నిర్మించనున్న బి.టి.రోడ్ కు రూ.7.20 కోట్లు, గరిడేపల్లి నుండి సీతారాంతండా వరకు 5 కిలోమీటర్ల కు గాను రూ.5.10 కోట్లు , నేరేడుచర్ల మండలం దిర్శించర్ల నుంచి ముత్యాలమ్మ కుంట మీదుగా చిట్టివారిగూడెం వరకు 2.90 కిలో మీటర్ల కు గాను రూ.3.20 కోట్లు, మఠం పల్లి మండలం కామాక్షికుంట తండా నుండి చెన్నాయిపాలెం వరకు 2 కిలోమీటర్లకు గాను రూ.2.20 కోట్లు, అదే మండలం బక్కమంతులగూడెం నుండి అల్లిపురం వరకు 3 కిలో మీటర్లకు గాను రూ.3.10 కోట్లు,చౌటపల్లి మండలం అల్లిపురం వరకు 4 కిలోమీటర్లకు గాను రూ.4.20 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అదే విదంగా కోదాడ నియోజకవర్గ (Kodada Constituency)పరిధిలోని మోతె మండలం నాయకుగూడెం నుండి విబలాపురం వరకు 3.20 కిలో మీటర్లకు గాను రూ.3.50 కోట్లు, అదే మండలం అన్నారిగూడెం మఱ్ఱి చెట్టు నుండి కరక్కాయలగూడెం వరకు 2 కిలోమీటర్ల దూరానికి గాను రూ.2.30 కోట్లు, నడిగూడెం మండలం వల్లాపురం నుండి కేశవాపురం వరకు 2 కిలోమీటర్లకు గాను రూ.2.00 కోట్లు, నారాయణపురం నుండి కే.ఆర్.సి పురం వరకు 3.40 కిలోమీటర్లకు గాను రూ.3.20 కోట్లు, మోతె మండలం నామావరం నుండి సీతానగరం వరకు 4 కిలో మీటర్ల దూరానికి గాను రూ.4.00 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ వెల్లడించారు.