–37.60 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల నిర్మాణాలకు పచ్చజెండా
— రూ. 40 కోట్ల నిధులు మంజూరు చేయించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతీ
–హుజుర్నగర్ నియోజకవర్గ గ్రామీ ణ రహదారులకు రూ. 25 కోట్లు
–కోదాడ గ్రామీణ రహదారులకు రూ. 15 కోట్లు
Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గల పరిధిలోని గ్రామాలలో అంతర్గత రహదారుల కు మహర్దశ చేకూరింది. దశాబ్ద కాలంగా కనీసం మరమ్మతులకు కుడా నోచుకోని ప్రాంతాల్లో కొత్తగా రోడ్డు నిర్మాణాలకు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఉపక్రమించారు. ఆ రెండు నియో జకవర్గాలలో జరుగుతున్న అభి వృద్ధి పై మరోసారి మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. ఏకంగా 40 కోట్ల నిధులను మంజూరు చేయి స్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ చేయించారు. రాష్ట్ర పంచా యతీరాజ్ గ్రామీణాభివృద్ధి చేపట్టి న నూతన రహదారుల నిర్మాణం లో బాగంగా జీ. ఓ.నెంబర్ 593(11/10/2024) విడుదలైన ఉత్తర్వులలో ఆ రెండు నియోజ కవర్గాలకు చెందిన గ్రామీణ ప్రాం తాలలో 37.60 కిలోమీటర్ల నూత న రహదారుల నిర్మాణాలు చేపట్ట నున్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్ నగర్ నియోజకవర్గానికి రూ. 25 కోట్ల నిధులు మంజూరు కాగా ఉత్తమ్ పద్మావతీ ప్రాతిని ధ్యం వహిస్తున్న కోదాడ నియోజ కవర్గానికి రూ. 15 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్ నగర్ నియో జకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతా లలో 23.90 కిలోమీటర్లు మేర అంతర్గత రహదారులు నిర్మిం చనున్నారు.నియోజకవర్గ పరిధిలోని గడ్డిపల్లి బరెల్ గ్రౌండ్ నుండి బొలిశెట్టి గూడెం మీదుగా కొనాయిగూడెం వరకు 7 కిలోమీ టర్ల దూరం నిర్మించనున్న బి.టి. రోడ్ కు రూ.7.20 కోట్లు ,గరిడేపల్లి నుండి సీతారాంతండా వరకు 5 కిలోమీటర్ల కు గాను రూ.5.10 కోట్లు ,నెరేడుచర్ల మండలం దిర్శించర్ల నుండి ముత్యాలమ్మ కుంట మీదుగా చిట్టివారిగూడెం వరకు 2.90 కిలో మీటర్ల కు గాను రూ.3.20 కోట్లు, మఠం పల్లి మండలం కామాక్షికుంట తండా నుండి చెన్నాయిపాలెం వరకు 2 కిలోమీటర్లకు గాను రూ.2.20 కోట్లు, అదే మండలం బక్కమం తులగూడెం నుండి అల్లిపురం వరకు 3 కిలో మీటర్లకు గాను రూ.3.10 కోట్లు,చౌటపల్లి మండ లం అల్లిపురం వరకు 4 కిలోమీ టర్లకు గాను రూ.4.20 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)పేర్కొన్నారు.
అదే విదంగా కోదాడ నియోజకవర్గ (Kodada Constituency)పరిధిలోని మోతె మండలం నాయ కుగూడెం నుండి విబలాపురం వరకు 3.20 కిలో మీటర్లకు గాను రూ.3.50 కోట్లు, అదే మండలం అన్నారిగూడెం మఱ్ఱి చెట్టు నుండి కరక్కాయలగూడెం వరకు 2 కిలోమీటర్ల దూరానికి గాను రూ.2.30 కోట్లు, నడిగూడెం మండలం వల్లాపురం నుండి కేశవాపురం వరకు 2 కిలోమీటర్లకు గాను రూ.2.00 కోట్లు, నారాయణపురం నుండి కే.ఆర్.సి పురం వరకు 3.40 కిలోమీటర్లకు గాను రూ.3.20 కోట్లు, మోతె మండలం నామావరం నుండి సీతానగరం వరకు 4 కిలో మీటర్ల దూరానికి గాను రూ.4.00 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ వెల్లడించారు.ఇటీవల కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాలకు అంతంత మంత్రాంగ ఉన్న గ్రామీణ అంతర్గత రహదా రులు (Rural internal roads)పూర్తిగా దెబ్బతిన్న నేప ద్యంలో స్థానిక ప్రజలు,ప్ర జాప్ర తినిధులు సంయుక్తంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ దృష్టికి తీసుక రాగా స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో యుద్ద ప్రాతిపదికన అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించి అంచానలు రూపొందించి నిధులు మంజూరు చేయించారు. రెండు నియోజక వర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల అంతర్గత రహదారుల నిర్మాణాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేయించడం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.