Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: తెలంగాణను బీజేపీ నిర్లక్ష్యం

–కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
–తెలంగాణ, ఏపీలకు విభజన
చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలి
–బీజేపీ తన మిత్ర పక్షాలను ప్రస న్నం చేసుకునే బడ్జెట్
–రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలం గాణ (BJP Telangana)ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. మంగళవారం లోక్ సభ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (Central Budget) 2024 25లో తెలంగాణను పూర్తిగా విస్కరించారన్నారు. తెలంగాణ కు తీరని అన్యాయం చేశారన్నారు. తెలంగాణ ను నిర్లక్ష్యం చేసిన బీజేపీ తీరును ఖండించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు జి కిష న్రెడ్డి, బండి సంజయ్ సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన వాటాను పొందడంలో విఫల మయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించిందని అన్నారు. పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన బడ్జెట్ అని, ఇది మాత్రం ప్రజల కోసం ప్రవేశ పెట్టినది కాదని అన్నారు. బీజేపీ కేవలం తన మిత్రపక్షాలు, జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే రూపొందించిన బడ్జెట్ అని ఆరోపించారు.

బీహార్కు రూ.41,000 కోట్ల ఆర్థిక సాయం అందించగా, ఆంధ్రప్రదేశ్ కు రూ.15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా ఇతర నిధులు వచ్చాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు (Congress ruled states), ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు తరు వాత కేంద్ర ప్రవేశ పెట్టిన 11వ బడ్జెట్ లో మొదటిసా రిగా, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం’ పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారు, కానీ మొత్తం ప్రసంగంలో మంత్రి తెలంగాణ అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. తెలంగాణ ప్రస్తావ నను పూర్తిగా దాటవేయడాన్ని మంత్రి ఖండిం చారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరే కించనప్పటికీ, తెలంగాణ పట్ల చూపు తున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమం త్రి ఎ రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రుల (Ministers of Telangana)బృందం గత ఏడు నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు ఇవ్వాలని కోరుతూ పలు దరఖాస్తులు సమర్పించామని గుర్తు చేశారు.

పోల వరం ప్రాజెక్టుకు (Pola Varam project) నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలమూరు రంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీ లను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం విశ్వ ప్రయ త్నాలు చేస్తోందని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం లోని హామీలైన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టర్. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సి టీకి నిధులు, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ మరియు చట్టంలో చేసిన ఇతర వాగ్దానాలు అమలు చేయాలని అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీ లను నెరవేరుస్తామని ఆర్థిక మంత్రి చేసిన ప్రకట నను స్వాగతిస్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదే తో చేసిన హామీలు నెరవేరుతాయని భావిస్తున్నా మని ఆయన అన్నారు.