Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: శాలిగౌరారం ప్రాజెక్టుకు చామల యాదగిరిరెడ్డి పేరు పెట్టాలి

–మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి

Uttam Kumar Reddy: ప్రజా దీవెన, శాలిగౌరారం: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు కు ప్రముఖ గాందేయవా ది,స్వాతంత్ర్య సమరయోధులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత,స్వర్గీయ చామల యాదగిరి రెడ్డి (Yadagiri Reddy)పేరు పెట్టాల ని పలువురు రైతులు, నాయకులు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి (Uttam Kumar Reddy)వినతి పత్రం అందజేశారు.నల్గొండ జిల్లా శాలిగౌరారం నకు చెందిన చామల యాదగిరి రెడ్డి శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధికి ఎంతో కృషి చేశాడాని, ఈ ప్రాజెక్టు తో నేడు వేలాది భూములు సస్యశ్యామలం అవుతున్నాయని పేర్కొన్నారు. యాదగిరి రెడ్డి (Yadagiri Reddy) చివరి శ్వాస వరకు ప్రాజెక్టులోకి నీరు తీసుకరావడానికి తాపత్రయ పడిన మహనీయుడన్నారు.

శాలిగౌరారం మండల (Saligauraram mandal) అభివృద్ధి కొరకు, మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాల కొరకు, వ్యవసాయ మార్కెట్ స్థాపన కొరకు, విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు (For construction of government offices, establishment of agricultural market, construction of electricity sub-station) కు అవిరాల కృషి చేశాడాని అందుకే అయన జ్ఞాపకార్థం ప్రాజెక్టు కు పేరు పెట్టాలని కోరారు. ప్రాజెక్టు కట్ట మీద యాదగిరి రెడ్డి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించాలని కోరారు.ప్రెస్ అకాడమీ రాష్ట్ర ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి కూడా చామల యాదగిరి రెడ్డి గురుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వివరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కోమటిరెడ్డి ప్రతీక్ మొమోరియల్ ట్రస్ట్ కన్వీనర్ ఎంవి గోనారెడ్డి,చామల వెంకటరమణా రెడ్డి, గూని వెంకటయ్య, పడాల రమేష్, లోడంగి మహేష్ తదితరులు పాల్గొన్నారు.