–ఐసిడిఎస్ పిడి కృష్ణవేణి
–పిల్లలను చట్టబద్ధంగానే దత్తత తీసుకోవాలని సూచన
Child Protection :ప్రజాదీవెన, నల్గొండ :వదిలి వేయబడ్డ పిల్లలను సంరక్షించడం కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రసూతి వైద్యశాలలు, జిల్లా కేంద్ర ఆస్పత్రి శిశు గృహం నందు ప్రత్యేకంగా ఉయ్యాల ఏర్పాటు చేశారు. బుధవారం జిల్లా కేంద్ర ఆస్పత్రి, శిశుగృహ నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉయ్యాల కార్యక్రమాన్ని ఐసిడిఎస్ పిడి కృష్ణవేణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ పిడి మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా అనాధ బాలలను వదిలేయడం లాంటివి చేయకూడదని తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలను పోషించలేని పరిస్థితి ఉన్నట్లయితే ఆ పిల్లలను సంబంధిత హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉయ్యాల నందు అప్పగించాలని తెలిపారు. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని సూచించారు.
అక్రమ దత్తత తీసుకున్నట్లయితే దంపతులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సి డబ్ల్యూ సి చైర్మన్ చింతా కృష్ణ, నెంబర్ ఈద భాస్కర్, జిల్లా ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ అరుణ కుమారి, డాక్టర్
రజిని రీజినల్ మెడికల్ ఆఫీసర్, బిఆర్బి కో ఆర్డినేటర్ హరిత, డిసిపియు గణేష్, శిశుగ్రహ సిబ్బంది పాల్గొన్నారు.