Vasavi Club : ప్రజా దీవెన, కోదాడ: కోదాడ వాసవి క్లబ్ అధ్యక్షులుగా శేక్ శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సయ్యద్ జమాల్ మెమోరియల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాల చైర్మన్ సయ్యద్ జాఫర్ బుధవారం పూలమాల శాలువులతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాలగా ఎస్ఎస్ రావు తనకు సుపరిచితుడాన్ని సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలను ఆదుకొని అక్కున చేర్చుకున్నారని ఆయన గుర్తు చేశారు .
ప్రస్తుతం వాసవి క్లబ్ అధ్యక్షునిగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని తెలిపారు ఈ కార్యక్రమములో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఎస్ శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎస్కే సైదులు, జి నరసింహారావు ,డి శ్రీను, డి మట్టపల్లి, కె శరభా రెడ్డి, బి రఘురాం ,తదితరులు పాల్గొన్నారు